'టెంపర్' ఆడియో విడుదల... మళ్లీ వాయిదా..!
పూరి జగన్నాథ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'టెంపర్'. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్ర ఆడియోను తొలుత ఈ నెల 18న విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. అయితే కొన్ని కారణాల వల్ల వాయిదాపడింది. ఆ తర్వాత ఈ నెల 26వ తేది రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేయనున్నట్టు ప్రకటించింది.
అయితే ఆడియో విడుదలను మళ్లీ వాయిదా వేశారు. ఈ నెల 31వ తేది విడుదల చేస్తామని చిత్ర దర్శక నిర్మాతలు ప్రకటించారు. ఈ తేదిలో మాత్రం మార్పు ఉండదని, ఖచ్చితంగా ఆడియో విడుదల అవుతుందని తెలిపారు. ఎందుకంటే టెంపర్ను ఫిబ్రవరి 14వ తేది ప్రేమికుల రోజు కానుకగా విడుదల చేస్తుండడంతో ఆడియోను తప్పని సరిగా ఈ నెల చివరి లోపే విడుదల చేయాల్సి ఉంటుందని వెల్లడించారు.
కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడత్రన్ వర్క్ జరుగుతున్న ఈ సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత కొంత కాలంగా హిట్కు దూరంగా ఉన్న ఎన్టీఆర్ కూడా ఈ చిత్రంపైనే ఆశలు పెట్టుకుని ఉన్నట్టు సమాచారం.