ఆ పనికి 'గుడిలో.. బడిలో' పాప పూజా హెగ్డే ఉందిగా...!

'గుడిలో.. బడిలో' పాట ఎంత వివాదాన్ని తెచ్చిందో తెలిసిందే. ఆ సినిమా 'దువ్వాడ జగన్నాథం'లో నటించిన అల్లు అర్జున్ కన్నా అందులో హీరోయిన్ పూజా హెగ్డేకు మంచి పేరే ప్రేక్షకుల నుంచి వచ్చింది. జీరో సైజ్ నడుముతో

గురువారం, 5 అక్టోబరు 2017 (14:46 IST)
'గుడిలో.. బడిలో' పాట ఎంత వివాదాన్ని తెచ్చిందో తెలిసిందే. ఆ సినిమా 'దువ్వాడ జగన్నాథం'లో నటించిన అల్లు అర్జున్ కన్నా అందులో హీరోయిన్ పూజా హెగ్డేకు మంచి పేరే ప్రేక్షకుల నుంచి వచ్చింది. జీరో సైజ్ నడుముతో మిల్కీ బ్యూటీలా కనిపించే పూజా హెగ్డేకు ఆ తర్వాత సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాలేదు. బాలీవుడ్ వైపు దృష్టిపెట్టిన పూజా హెగ్డే అక్కడా అవకాశాలు దొరకడం లేదు. దీంతో ఇక ఐటెం సాంగ్స్‌కు సిద్ధమైపోయింది పూజా.
 
రాంచరణ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న 'రంగస్థలం 1985' సినిమాలో ప్రత్యేక ఐటం సాంగ్‌కు పూజా హెగ్డే నర్తించనుంది. సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సుకుమార్ సినిమాలంటేనే గతంలో ఐటెం సాంగ్‌లు ఖచ్చితంగా ఉంటాయి. ఈ సినిమాలో కూడా ఐటెం సాంగ్‌ను చిత్రీకరించేందుకు దర్శకుడు సిద్ధమయ్యారు. 
 
అయితే సాంగ్‌లో ఎవరిని పెట్టాలని ఆలోచిస్తున్నప్పుడు సుకుమార్‌కు పూజా హెగ్డే అయితే బాగుంటుందని కొంతమంది సలహా ఇచ్చారట. దీంతో ఆమె అయితే ఇప్పుడు బాగుంటుందని సుకుమార్ కూడా ఒక నిర్ణయానికి వచ్చేశారట. దీంతో ఫోన్‌లో పూజాను సుకుమార్ సంప్రదిస్తే నేను ఐటం సాంగ్ చేస్తానని చెప్పినట్టు సమాచారం. దీంతో ఐటెం గర్ల్‌గా పూజా హెగ్డే రంగస్థల సినిమాలో అందాలను ఆరబోయనుంది.

అన్నీ చూడండి

బక్రీద్ పండుగ - ఉస్మానియా విశ్వవిద్యాలయం పరీక్షల రీ-షెడ్యూల్

భూమి కోసం అక్కను కత్తితో పొడిచి చంపేసిన తమ్ముడు

బరాకా అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడి : ఇరాన్ చర్యేనా?

ఆరు నెలల్లో టీవీకే ప్రభుత్వం కుప్పకూలిపోతుంది : డీఎంకే ఎమ్మెల్యే జోస్యం

Nara Devansh: జెన్ జెడ్ కంటెంట్‌ క్రియేటర్‌గా నారా దేవాన్ష్.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు (video)

అన్నీ చూడండి

మామిడి పండ్లు తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

బ్యాడ్ కొలెస్ట్రాల్ వుందా, ఇలా వదిలించుకోవచ్చు

మీ చాయ్‌: ఆంధ్రప్రదేశ్‌లో టీ కల్తీపై అవగాహన కల్పిస్తోన్న టాటా టీ చక్ర గోల్డ్ జెమిని

వాతావరణ మార్పులు, ప్రజల నేత్ర ఆరోగ్యం: తలెత్తుతున్న ఆందోళనలు

మితిమీరి గోధుమ రోటీలను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments