Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ నిర్ణయంతో ఆలోచనలో పడ్డ నాగ్

Written By శ్రీ
Updated: సోమవారం, 21 సెప్టెంబరు 2020 (18:56 IST)
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ రాథేశ్యామ్ తర్వాత ఎవరితో సినిమా చేస్తాడా..? అని ఎదురు చూస్తే.. మహానటి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన నాగ్ అశ్విన్‌తో సినిమాని ఎనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. అది కూడా ఈ సినిమా పాన్ ఇండియా మూవీ కాకుండా.. పాన్ వరల్డ్ అంటూ ఎనౌన్స్ చేసి సంచలనం సృష్టించారు. ఎప్పుడెప్పుడు సినిమా సెట్స్ పైకి వెళుతుందా అని ఎదురు చూస్తుంటే... ప్రభాస్ ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లకుండానే.. బాలీవుడ్ మూవీ ఆదిపురుష్ ఎనౌన్స్ చేసి మరోసారి సర్ఫ్రైజ్ చేసాడు.
 
అయితే ఆదిపురుష్ ఎనౌన్స్ చేసినప్పటి నుంచి నాగ్ అశ్విన్ ఆలోచనలో పడ్డాడట. ఎందుకంటే.. రాథేశ్యామ్ పూర్తవ్వాలి. ఆ తర్వాత నాగ్ అశ్విన్‌తో సినిమా స్టార్ట్ చేస్తాడా..? ఆదిపురుష్ స్టార్ట్ చేస్తాడా..? అనేది ఆసక్తిగా మారింది. దీంతో నాగ్ అశ్విన్ తెగ టెన్షన్ పడుతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఆయన దగ్గర కొన్ని కాన్సెప్ట్ బేస్డ్ కథలు వున్నాయట.
 
అందుచేత ఈ గ్యాప్‌లో ఓ చిన్న కథతో సినిమా చేద్దామా... ప్రభాస్ డేట్స్ ఇచ్చేవరకు ఆగుదామా..? అని ఆలోచిస్తున్నాడని టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ రాథేశ్యామ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత ఆదిపురుష్‌, నాగ్ అశ్విన్‌తో మూవీ రెండూ ఒకేసారి చేయాలనుకుంటున్నాడని తెలిసింది. అందుచేత నాగ్ అశ్విన్ ఈ గ్యాప్‌లో చిన్న సినిమా చేయకుండా ప్రభాస్ కోసమే వెయిట్ చేయాలని డిసైడ్ అయ్యాడని అంటున్నారు.

అన్నీ చూడండి

హరిద్వార్ గంగాఘాట్‌లో టూపీస్‌తో మహిళ స్నానం.. వీడియోపై రచ్చ రచ్చ (video)

గోవా కోర్టులో లొంగిపోయిన తరుణ్ తేజ్‌పాల్..

మాజీమంత్రి ఆళ్ల నాని గుండెపోటుతో హఠన్మరణం

రైల్వే పట్టాలపై కూర్చుని ఏం మాటలు.. రైలు ఢీకొని.. భారత సంతతి యువతి, స్నేహితుడు మృతి

పల్నాడులో పోలీసుల ఎదుట లొంగిపోయిన ఇద్దరు మావోయిస్టులు

అన్నీ చూడండి

చక్కెర వ్యాధిని తెచ్చే అలవాట్లు ఇవే...

మహమ్మారులను తట్టుకోగల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు బాటలు: ఇండియా హెల్త్ ఫార్వర్డ్ 2047

చిన్ననాటి టీకాలతో ఆగిపోకూడదు, అన్ని వయసుల్లో వ్యాక్సినేషన్ అవసరం

ఆరోగ్యం తేడా వచ్చి ఆస్పత్రులకు వెళితే గుంజేస్తాయి, అందుకే DatesMilk

నెఫ్రోప్లస్ NIDA, నెఫ్రోప్లస్ అంతర్జాతీయ డయాలిసిస్ అకాడమీ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments