బాలీవుడ్ రామాయణం నుంచి సాయిపల్లవి తప్పుకుందా?

సెల్వి
శుక్రవారం, 9 ఫిబ్రవరి 2024 (11:39 IST)
ఫిదా భామ సాయి పల్లవి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం నాగ చైతన్యతో కలిసి 'తాండల్' సినిమా షూటింగ్‌లో ఉన్న సాయి పల్లవికి బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ నుండి అనేక ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా ఆమె రామాయణం ప్రాజెక్ట్‌కి కమిట్ అయినట్లు సమాచారం. నితీష్ తివారీ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో రణబీర్ కపూర్ రాముడి పాత్రను పోషించాడు. 
 
దర్శకుడు సాయి పల్లవిని అమితంగా ఆరాధించడంతో సీత పాత్రలో నటించేందుకు ప్రత్యేకంగా ఆమెను ఎంపిక చేసుకున్నాడు. కానీ ఇటీవలి నివేదికల ప్రకారం, సాయి పల్లవి ఈ చిత్రం చాలా కాలం ఆలస్యం కావడం వల్ల ఇందులో పాల్గొనకూడదని నిర్ణయించుకుంది. 
 
కాల్షీట్స్ కారణంగా ఇతర సినిమాలను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే సాయి పల్లవి ఈ ప్రాజెక్ట్ నుండి వైదొలగలేదని సన్నిహితులు అంటున్నారు. ఆమె ఇప్పటి వరకు "తాండల్" మినహా ఇతర ముఖ్యమైన చిత్రాలలో నటించలేదని గుర్తు చేస్తున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో వేచి చూడాల్సిందే. 

అన్నీ చూడండి

జగన్‌.. గత చరిత్ర తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది... బీటెక్ రవి వార్నింగ్

కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది - మోడీ వరుస విజయాలకు కాంగ్రెస్ అసమర్థత : ఉదయనిధి స్టాలిన్

బలూచిస్థాన్‌లో రక్తపాతం - పాక్ సైనికులు వెళుతున్న రైలుపై ఉగ్రదాడి..

ఇద్దరు ప్రాణాలు తీసిన అడుగున్నర భూమి .. ఎక్కడ?

టీవీకే ప్రభుత్వ శుభవార్త... వచ్చే బిల్లింగ్ సైకిల్ నుంచే ఉచిత విద్యుత్ పథకం అమలు

అన్నీ చూడండి

మండుటెండలో నుంచి చల్లటి నీరు తాగితే...

నువ్వుల నూనెతో ప్రయోజనాలు ఏమిటి?

మెంతి ఆకుల పేస్టుతో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

పార్కిన్సన్స్ నియంత్రణలో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ కీలక చికిత్స: మెడికవర్ వైద్యులు

డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ నుంచి నోటి ద్వారా తీసుకునే సెమాగ్లుటైడ్ బయోసిమిలర్ ఒబెడా టాబ్లెట్లు

తర్వాతి కథనం
Show comments