Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిట్టి ఈజ్ బ్యాక్.. 'లకలక స్థానంలో కుక్కురు'... #2Point0Teaser

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, బాలీవుడ్‌స్టార్ అక్షయ్ కుమార్‌లు హీరో, విలన్ పాత్రల్లో నటిస్తున్న చిత్రం '2.O'. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం టీజర్‌ను వినాయకచవితి పండగ సందర్భంగా రిలీజ్ చేశారు. '

Written By pnr
Updated: గురువారం, 13 సెప్టెంబరు 2018 (10:17 IST)
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, బాలీవుడ్‌స్టార్ అక్షయ్ కుమార్‌లు హీరో, విలన్ పాత్రల్లో నటిస్తున్న చిత్రం '2.O'. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం టీజర్‌ను వినాయకచవితి పండగ సందర్భంగా రిలీజ్ చేశారు. 'రోబో' సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాలో అమీ జాక్సన్ హీరోయిన్. టీజర్‌లో స్పెషల్ ఎఫెక్ట్స్ ఆకట్టుకుంటున్నాయి.
 
ఒక్కసారిగా ఫోన్లన్నీ మాయమైపోతున్న సన్నివేశాలతో టీజర్‌ మొదలైంది. ఓ వ్యక్తి నిద్రిస్తున్నప్పుడు ఉన్నట్టుండి లేచి చూడగానే కోట్లాది ఫోన్ల మధ్యలో ఉండడం చూసుకుని జడుసుకుంటాడు. ఆ సమయంలో పైనుంచి భీకరమైన ముఖంతో అక్షయ్‌ కుమార్‌ ఎంట్రీ అదిరిపోయింది. శంకర్‌ ముందు నుంచీ వీఎఫ్‌ఎక్స్‌ కారణాల వల్ల సినిమా ఆలస్యం అవుతోందని చెప్తున్నారు. ఆలస్యమైనప్పటికీ ఓ అద్భుతమైన టీజర్‌ను అందించారు.
 
భారీ బడ్జెట్‌తో దీన్ని తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఇందులో అత్యధిక భాగం వీఎఫ్‌ఎక్స్‌ పనుల కోసమే ఖర్చు చేశారు. హాలీవుడ్‌ చిత్రాలకు ధీటుగా ఇందులో వీఎఫ్‌ఎక్స్‌ ఉంటాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం 75 మిలియన్‌ డాలర్లు ఖర్చు చేశారట. అంటే మన కరెన్సీలో రూ.540కోట్లు. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 3 వేల మంది నిపుణులు దీని కోసం పనిచేశారు. ఇక ప్రచారానికీ భారీగానే ఖర్చు చేస్తున్నారు.
 
ఇకపోతే, చంద్రముఖి సినిమాలో 'లకలక' అంటూ ఆకట్టుకున్న రజినీ... ఈ సినిమాలో కూడా 'కుక్కురు' అంటూ తనదైనశైలిలో పలుకుతూ కేక పుట్టించారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను త్వరలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. 
 
About Author
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

జూలై 30, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంది?

సుప్రీం కోర్టు ఆదేశాన్నే ధిక్కరిస్తారా? బొద్దింక జనతా పార్టీ మైండ్ సెట్ పైన నెటిజన్లు ఫైర్

ఏపీలో స్కైరూట్ ఏరోస్పేస్‌కు 300 ఎకరాల భూమి కేటాయింపు.. నారా లోకేష్ హర్షం

లోకేష్ సార్.. మిమ్మల్ని కలవాలనుంది.. చిన్నారులకు ఓకే చెప్పిన మంత్రి (video)

పెళ్లి కాలేదన్న ఆవేదన.. మహారాష్ట్రలో ఏకంగా 29మంది యువకుల ఆత్మహత్య

అన్నీ చూడండి

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆల్‌బకరా పండ్లు తినవచ్చా?

కాలేయ వ్యాధుల నివారణకు ముందస్తు హెపటైటిస్ స్క్రీనింగ్ తప్పనిసరి: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్

గర్భిణీ స్త్రీలు నామల చేపలు తినవచ్చా?

మోకాలి నొప్పి వచ్చిన ప్రతి ఒక్కరికీ Knee Replacement అవసరం లేదు, ఐతే...

ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తే గుండె పోటు కావచ్చేమో చెక్ చేయించుకోవాలి

తర్వాతి కథనం
Show comments