టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకి అరుదైన గౌరవం.. అదేంటంటే?

శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (15:08 IST)
సూపర్‌స్టార్ మహేశ్ బాబుకి మరో అరుదైన అవకాశం దక్కింది. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ఆయన మైనపు విగ్రహాన్ని రూపొందించింది. ఈ మైనపు విగ్రహాన్ని మార్చి 25న మహేశ్ స్వయంగా హైదరాబాద్‌లోని ఏఎంబి సినిమాస్ వేదికగా ఆవిష్కరించనున్నాడు. ఆ తర్వాత విగ్రహాన్ని సింగపూర్‌కి తరలించి అక్కడి టుస్సాడ్స్ మ్యూజియంలో ఉంచనున్నారు. 
 
టుస్సాడ్స్ మ్యూజియం వాళ్లు ఒక విగ్రహాన్ని సింగపూర్‌లో కాకుండా బయట ఆవిష్కరించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. మహేశ్‌కి దక్కిన ఈ అరుదైన గౌరవం పట్ల ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మహేశ్ మహర్షి సినిమాతో బిజీగా ఉన్నాడు. వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. 
 
దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకూరుస్తుండగా పూజా హెగ్దే ఫీమేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. భరత్ అనే నేను చిత్రం భారీ విజయాన్ని నమోదు చేయడంతో మహర్షి సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరాయి. ఈ చిత్రం ఏప్రిల్ 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.

అన్నీ చూడండి

జూలై 5న భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభానికి సన్నాహాలు

నన్ను ఓడించలేకపోతే పేరు మార్చుకుంటానని ఒకాయ అన్నాడు, అలా ఏ కులం వారైనా అంటారా? ముద్రగడకు పవన్ స్ట్రాంగ్ కౌంటర్

TGSRTC: 60 ఎలక్ట్రిక్ బస్సుల్ని రంగంలోకి దించనున్న టీజీఎస్సార్టీసీ

ప్రమాదంలో గాయపడిన మహిళా కానిస్టేబుల్‌ను రక్షించిన బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్

సైన్యంలో చేరితే రూ.1.33 కోట్ల రుణం నుంచి విముక్తి కల్పిస్తాం : వ్లాదిమిర్ పుతిన్

అన్నీ చూడండి

మంచినీటిలో నానబెట్టి తినాల్సిన ఆహారాలు ఏమిటి?

తీపి పదార్థాలను మోతాదుకి మించి తింటే ఏమవుతుందో తెలుసా?

మండుటెండలో నుంచి చల్లటి నీరు తాగితే...

నువ్వుల నూనెతో ప్రయోజనాలు ఏమిటి?

మెంతి ఆకుల పేస్టుతో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments