Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్పై మళ్లీ ఇన్స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్
నటి పూనమ్ కౌర్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో తనకు చాలా కాలంగా ఉన్న సమస్యను మరోసారి వెలుగులోకి తెచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా, ఆమె సోషల్ మీడియాలో అనేక రహస్య పోస్టులు చేసింది. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో, పూనమ్ త్రివిక్రమ్పై తన అధికారిక ఫిర్యాదుకు రుజువుగా పనిచేస్తున్నట్లు చెప్పే రెండు పోస్ట్లను షేర్ చేసింది.
పూనమ్ కౌర్ దర్శకుడు త్రివిక్రమ్పై చర్యలు తీసుకోవాలని గతంలో మా అసోసియేషన్కు ఫిర్యాదు చేసింది. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోవడం మూలంగానే త్రివిక్రమ్పై ఆ రోజు తాను చేసిన కంప్లైంట్ను ఇగ్నోర్ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
"నేను మా అసోసియేషన్లో త్రివిక్రమ్ మీద కంప్లైంట్ చేస్తే కనీసం అతడ్ని ప్రశ్నించలేదని, యాక్షన్ తీసుకోలేదని.. నా జీవితాన్ని అన్ని రకాలుగా నాశనం చేసిన అతడ్ని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు. నా ఆరోగ్యాన్ని, సంతోషాన్ని నాశనం చేశాడంటూ" త్రివిక్రమ్ మీద సంచలన ఆరోపణలు చేసింది. తాజాగా మరోసారి త్రివిక్రమ్పై ఆమె పోస్ట్ పెట్టారు.
"త్రివిక్రమ్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి," అంటూ పూనమ్ తన పోస్ట్లో రాసుకొచ్చింది. మా అసోసియేషన్ మెంబర్ అయినా ఝాన్సీతో జరిగిన చాటింగ్ను ఆమె బయటపెట్టారు. ఝాన్సీతో మాట్లాడాను. మీటింగ్ పెడదాం అని చెప్పి ఆలస్యం చేశారు. సడన్గా తనను డిస్టర్బ్ చెయ్యొద్దని దాటవేశారని పూనమ్ కౌర్ వెల్లడించింది.