కన్నడ ఎన్నికల బరిలో టాలీవుడ్ నటుడు

కర్ణాటక శాసనసభకు వచ్చే నెల 12వ తేదీన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో గెలుపుకోసం అధికార కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు పోటాపోటీగా కృషి చేస్తున్నాయి.

మంగళవారం, 24 ఏప్రియల్ 2018 (16:18 IST)
కర్ణాటక శాసనసభకు వచ్చే నెల 12వ తేదీన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో గెలుపుకోసం అధికార కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు పోటాపోటీగా కృషి చేస్తున్నాయి. అదేసమయంలో బలమైన అభ్యర్థులను బరిలోకి దించుతున్నాయి. అయితే, భారతీయ జనతా పార్టీ తరపున టాలీవుడ్ హీరో సాయికుమార్ బరిలోకి దిగుతున్నారు.
 
ఈయన మంగళవారం బీజేపీ అభ్యర్ధిగా చిక్కబళ్లాపుర జిల్లా బాగేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ అధిష్టానం ఆయనకు బీ-ఫాం ఇవ్వకపోవడంతో ఆయనకు టికెట్ దక్కుతుందా? లేదా? అన్న సందిగ్ధం ఏర్పడింది. 
 
దీనికి కారణం లేకపోలేదు. తొలుత స్థానికుడైన సి. కృష్ణారెడ్డికి టికెట్ ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే, చివరి నిమిషంలో సాయికుమార్ పేరును బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. బెంగళూరులోని డాలర్స్ కాలనీలోగల యడ్యూరప్ప నివాసం ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించి ఆయన ఇంట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, చివరకు సాయికుమార్‌కే టిక్కెట్ కేటాయించారు. 

అన్నీ చూడండి

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments