మోసం గురూ... అమెజాన్‌లో ల్యాప్ టాప్ బుక్ చేస్తే పుస్తకం-ఇటుకలు వచ్చాయ్

శనివారం, 30 జులై 2022 (17:57 IST)
ఆన్లైన్ మోసాలు హద్దులు మీరుతున్నాయి. ఆన్ లైన్ ద్వారా వస్తువులు కొనాలంటే బెంబేలెత్తిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. ఇదివరకు డబ్బు చెల్లిస్తే సరైన వస్తువు చేతికి అందుతుండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు క్రమంగా మారిపోతున్నాయి. ఒకటి ఆర్డర్ చేస్తే పనికిమాలిన వస్తువులు చక్కగా ప్యాకింగులో ఇంటికి వచ్చేస్తున్నాయి. దీనితో బాక్సు తెరిచి చూసిన వినియోగదారుడు షాక్ తింటున్నాడు. తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది.

 
పాట్నా సిటీకి సమీపంలోని ఫత్వా ప్రాంతానికి చెందిన సౌరభ్ అనే యువకుడు ఓ ల్యాప్ టాప్ కోసం ఈ నెల 24న రూ. 34,600 చెల్లించి అమెజాన్ లో బుక్ చేసాడు. అమెజాన్ నుంచి అతడికి ల్యాప్ టాప్ పంపుతున్నట్లు సందేశంతో పాటు బాక్సు కూడా వచ్చేసింది. యువకుడు వ్యాపారం చేస్తుండటంతో కాస్తంత అలెర్టుగా బాక్స్ ఓపెన్ చేస్తున్న దగ్గర్నుంచి అంతా వీడియో తీసాడు.

 
బాక్స్ ఓపెన్ చేయగా అందులో ల్యాప్ టాప్ లేదు. పోలీసు రిక్రూట్మెంట్ గైడ్ ఒకటి, రెండు ఇటుక ముక్కలు పార్శిల్లో వున్నాయి. వీటిని చూసి షాక్ తిన్న యువకుడు వెంటనే ఆ వీడియో క్లిప్పును అమెజాన్ కస్టమర్ కేర్ కి ఫిర్యాదు చేసాడు. ఫిర్యాదు అందుకున్న అమెజాన్ కస్టమర్ కేర్... ఈ వ్యవహారంపై పూర్తి దర్యాప్తు చేసిన సమాచారాన్ని అందిస్తామని రిప్లై ఇచ్చింది. మరి తప్పు ఎక్కడ జరిగిందో..?

అన్నీ చూడండి

జియోస్టార్, భారతదేశ వ్యాప్తంగా ఆరు బిగ్ బాస్ ఎడిషన్లు ఒకేచోట

Prabhas: స్పిరిట్ పంపిణీ కోసం పీపుల్ మీడియా, ఏషియన్ సురేష్ భాగస్వామ్యం

Priyadarshi: ఈ కథ విన్నప్పుడు మా అమ్మ గుర్తొచ్చింది : ప్రియదర్శి

Vijay: ఒకేలా బతకడానికి ఇంత పెద్ద జన్మ ఎందుకు? అనేది నాకు స్పూర్తి : వెంకట్ కె. నారాయణ

సోనమ్ రఘువంశీ ప్రవర్తనపై ప్రశ్నాస్త్రాలను సంధించిన సుప్రీం కోర్టు

తర్వాతి కథనం
Show comments