బిడ్డను రక్షించిన సిబ్బందికి తొండంపైకెత్తి కృతజ్ఞతలు చెప్పిన ఏనుగు!! (వీడియో)

Written By ఠాగూర్
Updated: మంగళవారం, 12 నవంబరు 2019 (12:59 IST)
ప్రమాదంలో చిక్కుకున్న తన బిడ్డను రక్షించిన అటవీ సిబ్బందికి ఓ ఏనుగు తొండం పైకెత్తి కృతజ్ఞతలు తెలిపింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను అటవీ శాఖ అధికారి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది వైరల్ అయింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ అటవీ ప్రాంతంలోని ఓ గున్న ఏనుగు ఓ గుంతలో పడిపోయింది.. దాన్ని బయటకు తీసేందుకు కొన్ని ఏనుగులు ప్రయత్నించగా, వాటి ప్రయత్నాలు ఫలించలేదు. 
 
ఈ విషయం తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. అటవీ సిబ్బందిని చూడగానే ఆ ఏనుగులు దూరంగా వెళ్లిపోయాయి. ఆ తర్వాత అటవీ సిబ్బంది ప్రొక్లెయిన్‌ సహాయంతో గున్న ఏనుగును ప్రమాదం నుంచి సురక్షితంగా రక్షించాయి. 
 
ఆ గున్న ఏనుగు బయటకు వచ్చిరాగానే తన తల్లివద్దకు చేరుకుంది. దీంతో అప్పటివరకు అక్కడే ఉన్న మిగిలిన ఏనుగులన్నీ తమదారిన తాము వెళ్లిపోయాయి. ఈ సమయంలో గున్న ఏనుగు తల్లి ఏనుగు కాసేపు ఆగి, అటవీ అధికారులు, సిబ్బంది వైపు తిరిగి తొండం పైకెత్తి కృతజ్ఞతలు తెలిపింది. ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కశ్వాన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.

 

అన్నీ చూడండి

జియోస్టార్, భారతదేశ వ్యాప్తంగా ఆరు బిగ్ బాస్ ఎడిషన్లు ఒకేచోట

Prabhas: స్పిరిట్ పంపిణీ కోసం పీపుల్ మీడియా, ఏషియన్ సురేష్ భాగస్వామ్యం

Priyadarshi: ఈ కథ విన్నప్పుడు మా అమ్మ గుర్తొచ్చింది : ప్రియదర్శి

Vijay: ఒకేలా బతకడానికి ఇంత పెద్ద జన్మ ఎందుకు? అనేది నాకు స్పూర్తి : వెంకట్ కె. నారాయణ

సోనమ్ రఘువంశీ ప్రవర్తనపై ప్రశ్నాస్త్రాలను సంధించిన సుప్రీం కోర్టు

తర్వాతి కథనం
Show comments