Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయిబాబా ఆలయంలో 3,700 కిలోల కిచ్డీ తయారీ.. గిన్నిస్ రికార్డ్ ఖాయమా?

Written By సెల్వి
Updated: శుక్రవారం, 28 ఏప్రియల్ 2023 (15:32 IST)
Kichidi
భోపాల్‌లోని అవధ్‌పురి సాయిబాబా ఆలయానికి చెందిన బృందం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ప్రవేశించే ప్రయత్నంలో 3,700 కిలోల భారీ కిచ్డీని తయారు చేసింది. 400 కిలోల కూరగాయలు, 350 కిలోల బియ్యం, 60 కిలోల పప్పులతో తయారు చేసిన వంటకాన్ని తయారు చేయడానికి సదరు బృందం ఆరు గంటల పాటు శ్రమించింది. 
 
కిచిడీ తయారు చేసిన అనంతరం ఆలయానికి తరలివచ్చిన 15 వేల మంది భక్తులకు ఈ కిచ్డీని పంచిపెట్టారు. తయారీ నుండి పంపిణీ వరకు మొత్తం ప్రక్రియ రికార్డ్ చేయబడింది. ధృవీకరణ కోసం గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బృందానికి పంపబడుతుందని నిర్వాహకులు తెలిపారు. 
 
ప్రసాదం తయారీకి దాదాపు రూ. 5 లక్షలు ఖర్చవుతుందని, నిపుణుల బృందంతో వంట నాణ్యతను పరిశీలించామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. వీరి సృజన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంటుందని ఆలయ నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. 

అన్నీ చూడండి

సీఎం విజయ్‌కి వున్న ఒకే ఒక్క టెన్షన్ అనగానే త్రిష... త్రిష అంటూ నినాదాలు, ఎక్కడ?

బాలీవుడ్‌లో నచ్చే పాత్రలు రావడం లేదు : హీరో సిద్ధార్థ్

సారీ సాయిపల్లవీ, నీకంటే నీ పక్కనే వున్నామే సీతగా బాగుంటుంది, ట్రోల్స్

చెన్నై లవ్ స్టోరీ విజయం ప్రేక్షకుల ప్రేమ, పరిశ్రమ ప్రశంసలే - రవి నంబూరి సత్తా

కార్తి, మోహన్ రాజా కాంబినేషన్ లో కొత్త సినిమా అనౌన్స్‌మెంట్

తర్వాతి కథనం
Show comments