Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాస్తిక నేత కరుణానిధి స్వర్గ ప్రాప్తినా? వేదపండితులేమంటున్నారు...

తన జీవితంలో భగవంతుడిని నమ్మని పరమ నాస్తికుడిగా పేరు తెచ్చుకున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత దివంగత కరుణానిధి స్వర్గానికి వెళ్లారని తమిళనాడు పండితులు చెబుతున్నారు. నాస్తికవాది అయిన కరుణాని

Written By pnr
Updated: శుక్రవారం, 10 ఆగస్టు 2018 (09:24 IST)
తన జీవితంలో భగవంతుడిని నమ్మని పరమ నాస్తికుడిగా పేరు తెచ్చుకున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత దివంగత కరుణానిధి స్వర్గానికి వెళ్లారని తమిళనాడు పండితులు చెబుతున్నారు. నాస్తికవాది అయిన కరుణానిధి ఏకాదశి (మంగళవారం) సాయంత్రం మృతి చెందటం, ద్వాదశి (బుధవారం)నాడు ఖననం చేయడంతో ఆయనకు స్వర్గ ప్రాప్తి లభిస్తుందని పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.
 
నిజానికి ఏకాదశినాడు సూర్యాస్తమయం వేళ మరణించడం, ద్వాదశి ఘడియల్లో అంత్యక్రియలు జరగడంతో ఆయనకు స్వర్గ ప్రాప్తి లభించిందని, ఇటువంటి భాగ్యం అందరికీ లభించదని అంటున్నారు. నాస్తికుడైన కరుణ అరుదైన అదృష్టానికి నోచుకున్నారని చెబుతున్నారు. ఆయనకు మోక్షప్రాప్తి కలగాలని చిదంబరంలోని నటరాజస్వామి ఆలయం రాజగోపురంపై పూజారులు మోక్ష దీపాలను కూడా వెలిగించడం గమనార్హం. 
 
ఇంకోవైపు, కరుణానిధిపై దాఖలైన 13 పరువునష్టం కేసులను కొట్టి వేస్తూ చెన్నై ప్రిన్సిపల్‌ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులన్నీ దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత దాఖలు చేసిన కేసులు కావడం గమనార్హం. 
About Author
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

దుల్కర్ సల్మాన్.. ఐ యామ్ గేమ్ నుంచి ఎవరే నువ్వే గీతం విడుదల

Shyam Prasad Reddy: అగధ లో కామాక్షి ని చూస్తే అరుంధతి లో అనుష్క ను గుర్తుచేసింది : శ్యాం ప్రసాద్ రెడ్డి

రాకేష్ వర్రే, మధుమిత సర్కార్ పై మాయలేడి చెంగు చెంగున దూకెరా.. సాంగ్

జ్యోతి పూర్వజ్ కిల్లర్ చిత్రం తెలుగు, తమిళ సహా పలు దేశాల్లో విడుదల.

Manchu Manoj :ఇండస్ట్రీకి కులం, గోత్రం లేదు : గజ టీజర్ లాంచ్ లో మంచు మనోజ్

తర్వాతి కథనం
Show comments