'మేడ్ ఇన్ ఇండియా - మేడ్ ఫర్ ఇండియా'... జియో వీడియో కాలింగ్ యాప్ (video)

శుక్రవారం, 3 జులై 2020 (08:58 IST)
దేశంలో చైనా యాప్‌లపై కేంద్రం నిషేధం విధించింది. దీంతో వీడియో కాలింగ్‌ చేసుకునే వారికి సమస్య తప్పదని భావిస్తూ వచ్చారు. అయితే, రిలయన్స్ జియో మరో అడుగు ముందుకేసింది. 
 
జూమ్ తదితర వీడియో కాలింగ్ యాప్‌లపై విముఖత పెరుగుతున్న వేళ, 'జియో మీట్' పేరిట హై డెఫినిషన్ వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్‌ను విడుదల చేసింది. ఇందులో ఇన్వైట్ కోడ్స్ అవసరం లేదని, ఇదే దీని ప్రత్యేకతని జియో ఓ ప్రకటనలో పేర్కొంది. 
 
100 మంది వరకూ ఒకేసారి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనవచ్చని, తమతమ స్క్రీన్స్ షేర్ చేసుకోవచ్చని సంస్థ పేర్కొంది. ఈ యాప్ పూర్తిగా ఉచితమని వెల్లడించింది. 
 
లాక్డౌన్ సమయంలో ఇంట్లో నుంచే పని చేసుకోవడానికి, అధికారులు, సిబ్బందితో కలిసుండటానికి, పాఠశాలలు ఆన్‌లైన్ క్లాసులు చెప్పుకోవడానికి అత్యంత అనుకూలంగా ఉంటుందని పేర్కొంది. ఈ యాప్‌ను https://jiomeetpro.jio.com నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది. 
 

అన్నీ చూడండి

వినాయక్ గారికి, V N ఆదిత్య ప్రారంభించిన కరుణామయ చిత్రం

Anna Lezhneva: పవన్ సొంత ఖర్చులే; డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపిన అన్నా లెజినోవా

యూనియన్ బ్యాంకు చర్యలను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన బండ్ల గణేశ్

అంత:పురం తర్వాత వదలా చిత్రం బెస్ట్ ఫిల్మ్. గ్లింప్స్ : తమ్మారెడ్డి భరద్వాజ్

ఎట్టకేలకు ఈ నెల 23వ తేదీన 'జన నాయగన్' మూవీ రిలీజ్

తర్వాతి కథనం
Show comments