చెన్నైలో కలకలం : తొలి కరోనా స్ట్రైన్ తొలి పాజిటివ్ కేసు నమోదు!!

మంగళవారం, 22 డిశెంబరు 2020 (14:17 IST)
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో కలకలం రేగింది. తొలి కరోనా స్ట్రైన్ కేసు నమోదైంది. బ్రిటన్ నుంచి చెన్నైకు వచ్చిన వ్యక్తికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. దీంతో ఆ వ్యక్తిని క్వారంటైన్‌కు తరలించారు. అలాగే, బ్రిటన్ నుంచి వచ్చిన మరికొంతమందిని ముందు జాగ్రత్త చర్యగా వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. 
 
నిజానికి ఇప్పటికే కరోనా వైరస్ దెబ్బకు ప్రతి ఒక్కరూ హడలిపోతున్నారు. ముఖ్యంగా, అగ్రరాజ్యాలకు చెందిన ప్రజలు సైతం వణికిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో బ్రిటన్‌లో కొత్త రకం వైరస్ పుట్టుకొచ్చింది. పైగా, ఇది శరవేగంగా వ్యాపిస్తోంది. దీంతో బ్రిటన్ అంటేనే ఇతర దేశాల ప్రజలు హడలిపోతున్నారు. 
 
ఈ నేపథ్యంలో బ్రిటన్ నుంచి ఢిల్లీ వచ్చిన సదరు వ్యక్తి అక్కడి నుంచి చెన్నై చేరుకున్నాడు. కరోనా సోకినట్టు తేలడంతో అతడిని క్వారంటైన్‌లో ఉంచారు. బ్రిటన్‌లో రూపాంతరం చెందిన కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆ వ్యక్తి నుంచి నమూనాలు సేకరించి పూణేలోని జాతీయ వైరాలజీ సంస్థకు పంపించారు. ఆ వ్యక్తికి సోకింది కరోనా కొత్త రకం వైరస్సా? కాదా? అనేది పరీక్షల అనంతరం వెల్లడి కానుంది. 

అన్నీ చూడండి

Imtiaz Ali :: మెయిన్ వాపస్ ఆవుంగా తో 59 దేశాల్లో విజయం సాధించిన మ్తియాజ్ అలీ

Ajay Bhupathi : ఆ కథను నా డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఉంచుకోమని మహేష్ బాబు అన్నారు

Kajal Aggarwal: విడుదలకు ముందే చర్చకు తావిస్తున్న ది ఇండియా స్టోరీ

ఆ పోస్ట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారు.. ఆరోగ్యంగానే ఉన్నాను : అమితాబ్

జియోస్టార్, భారతదేశ వ్యాప్తంగా ఆరు బిగ్ బాస్ ఎడిషన్లు ఒకేచోట

తర్వాతి కథనం
Show comments