Webdunia - Bharat's app for daily news and videos

Install App

29 ఏళ్లకే సీఎం పదవిని చేపట్టనున్న శివసేన 'యంగ్ టైగర్' ఆదిత్య ఠాక్రే

Written By ఐవీఆర్
Updated: శుక్రవారం, 25 అక్టోబరు 2019 (11:48 IST)
మహారాష్ట్రకు శివసేన నుంచి అతి పిన్నవయసులోనే యంగ్ టైగర్ ఆదిత్య ఠాక్రే సీఎం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. దీనికి కారణం బీజేపీ హవా తగ్గడమే. గత ఎన్నికలతో పోల్చుకుంటే బీజేపీ కాస్త వెనక్కి తగ్గిందనే చెప్పాలి. 2014లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 122 స్థానాలు సాధించిన బీజేపీ ఈసారి 105 స్థానాలకే పరిమితమైంది. శివసేన తాజా ఎన్నికల్లో 56 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో శివసేన శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో బీజేపీపై ఒత్తిడి పెంచేందుకు శివసేన ప్రయత్నాలు చేస్తోంది.
 
సీఎం పదవీ కాలాన్ని చెరిసగం పంచుకోవాలని బీజేపీకి శివసేన ప్రతిపాదన పంపినట్లు తెలుస్తోంది. తొలి అవకాశం తమకే ఇవ్వాలని కూడా శివసేన కోరినట్లు తెలిసింది. ఆదిత్య ఠాక్రేను సీఎం చేయాలని శివసేన నేతలు డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
 
మరోవైపు శివసేన పార్టీ స్థాపించిన నాటి నుంచి ఠాక్రే కుటుంబం ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. ఈసారి బాల్ ఠాక్రే మనవడు ఆదిత్య ఠాక్రే 70 వేల బంపర్ మెజారిటీతో విజయం సాధించారు. ఇంకోవైపు భాజపాకు స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ఇక శివసేన దిక్కయ్యింది. ఈ నేపధ్యంలో 50-50 లెక్క ప్రకారం రెండున్నరేళ్లు శివసేన- మరో రెండున్నరేళ్లు భాజపా అధికారాన్ని పంచుకుంటాయన్న ప్రచారం జరుగుతోంది.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments