Webdunia - Bharat's app for daily news and videos

Install App

మర్కజ్ భవనం శుద్ధి.... 617 మందిలో కరోనా లక్షణాలు

Written By ఠాగూర్
Updated: బుధవారం, 1 ఏప్రియల్ 2020 (19:23 IST)
ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ భవనంలో ఉన్న ముస్లిం మతపెద్దలను ఖాళీ చేయించి, ఆ ప్రాంతాన్ని శుద్ధి చేశారు. ఈ భవనం నుంచి మొత్తం 2361 మందిని క్వారంటైన్‌కు తరలించారు. వీరిలో 617 మందికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టు సమాచారం. ఈ విషయాన్ని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తెలిపారు. 
 
ఈ మర్కజ్ మసీదు వేదికగా ఇటీవల మతపరమైన ప్రార్థనలు జరిగాయి. ఇక్కడు కరోనా బాధిత దేశాల నుంచి అనేక మంది ప్రతినిధులు వచ్చారు. ఈ సదస్సుకు హాజరై తమతమ ప్రాంతాలకు తిరిగివెళ్లిన వారి నుంచే ఈ వైరస్ దేశ వ్యాప్తంగా వ్యాపించింది. దీంతో ఈ మర్కజ్ మసీదును పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 
 
పైగా, ఇక్కడ ఉన్న వారందరినీ ఖాళీ చేయించి వివిధ ఆస్పత్రులకు తరలించారు. ఈ తరలింపు కార్యక్రమం ఏకంగా 36 గంటల పాటు సాగింది. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న వారందరికీ మనీష్‌ సిపోడియా కృతజ్ఞతలు తెలిపారు. 
 
ఇకపోతే, ఢిల్లీలోని మర్కజ్‌ భవన్‌తో పాటు పరిసర ప్రాంతాలను సౌత్‌ ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ సిబ్బంది శానిటైజేషన్‌ చేస్తున్నారు. మర్కజ్‌ భవన్‌లో మార్చి 1 నుంచి 15వ తేదీ వరకు జరిగిన మత ప్రార్థనల్లో ఇతర దేశాలకు చెందిన వారితో పాటు మన దేశానికి చెందిన పలువురు ముస్లింలు పాల్గొన్నారు. ఈ ప్రార్థనల్లో సుమారు 3 వేల మందికి పైగా పాల్గొన్నారు. వీరిలో పెక్కు మందికి ఈ వైరస్ సోకింది. 

అన్నీ చూడండి

Fauji Latest Update: ఫౌజీ కోసం బ్రిటీషర్లతో పోరాడే యోధునిగా ప్రభాస్ పై యాక్షన్ సీన్స్

ప్రదీప్ రావత్ అంత్యక్రియలకు హాజరైన అమీర్ ఖాన్, అశుతోష్ గోవారికర్

మగవాడికి కమిట్‌మెంట్ ఇవ్వనిదే సినిమా ఛాన్సే కాదు సీరియల్ ఛాన్స్ కూడా రాదు, యువతి వీడియో వైరల్

Genelia Deshmukh: అభిమానుల ప్రేమతో 39వ పుట్టినరోజు జరుపుకున్న జెనీలియా దేశ్‌ముఖ్

Jayam Ravi: భార్యతో విడాకులు.. వడ్డీ కాసుల వాడిగా జయం రవి

తర్వాతి కథనం
Show comments