తితిదే మమ్మల్ని తీసుకోవడంలేదు: ప్రధాని మోదీకి రమణదీక్షితులు వినతి

గురువారం, 28 జనవరి 2021 (20:17 IST)
తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామివారికి సేవ చేసే వ్యక్తుల్లో ప్రధానమైన వారు రమణదీక్షితులు, డాలర్ శేషాద్రి. పెద్ద డాలర్ వేసుకునే అర్చకులు డాలర్ శేషాద్రి. ఆయన్ను చేస్తూ ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే భక్తులు ఠక్కున గుర్తుపట్టేస్తారు. ఇలా రెండవ వారు రమణదీక్షితులు. వంశపారపర్యంగా రమణదీక్షితులు కొన్ని యేళ్ళ పాటు ఆలయ ప్రధాన అర్చకులుగా కొనసాగారు.
 
శ్రీవారికి సంబంధించిన కైంకర్యాలను స్వయంగా చేశారు. అయితే 2018 సంవత్సరంలో చట్టవిరుద్ధంగా వంశపాపరంపర్య పూజారులను పదవీ విరమణ చేయించినట్లు ఆవేదన వ్యక్తం చేస్తూ ట్విట్టర్ వేదికగా రమణదీక్షితులు ఒక సందేశాన్ని ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి పంపారు. 
 
హైకోర్టు ఆదేశాలు ఉన్నా మమ్మల్ని ఈరోజు వరకు టిటిడి తిరిగి తీసుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోను రమణదీక్షితులు ఇదేవిధంగా ట్విట్టర్ వేదికగా ట్వీట్లు చేయడం.. అదికాస్త వైరల్‌గా మారడం జరిగింది. కానీ ఈసారి మాత్రం ప్రధానమంత్రికి చేసిన ట్వీట్లో రామమందిర నిర్మాణానికి 50 వేల రూపాయల సహాయం కూడా చేస్తున్నట్లు చెప్పి మరీ తన సమస్యను విన్నవించుకున్నారు.
 

అన్నీ చూడండి

Kiran Abbavaram : ఛాట్ బస్టర్స్ గా దూసుకెళ్తున్న చెన్నై లవ్ స్టోరీ మూవీ

Dharma Mahesh : జీ5లో ట్రెండింగ్ టాప్-1గా ధర్మ మహేష్ చిత్రం డ్రింకర్ సాయి

డైరెక్టర్ రవిచరణ్ రెండవ చిత్రం నవాబ్ సిద్ధం, జూన్ లో జెన్ జి గర్ల్స్ ప్రారంభం

దర్శకరత్న దాసరి సమాధిని శుభ్రం చేసిన మంచు మనోజ్

chiatanya case: సమంతపై వస్తున్న కంటెంట్‌పై నాగ చైతన్య పోరాటం - సెప్టెంబర్ లో కోర్టు విచారణ

తర్వాతి కథనం
Show comments