Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈశాన్యంలో దేవుని మందిరాలు నిర్మిస్తే..?

Updated: శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (13:26 IST)
ఉదయం నిద్రలేవగానే ఉత్తర దిశవైపున చూడడం వలన కుబేరస్థానాన్ని చూసినట్లవుతుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఎవరైతే ఈ విధంగా చూస్తారో ఆ ఇంట్లో ధనానికి ఇబ్బంది ఉండదంటున్నారు. పడక నుండి నిద్రలేవగానే తూర్పుదిశగా నడిస్తే మంచిదని.. దీని వలన ఈ రోజు చేయాలనుకున్న పనులు ఆటంకాలు లేకుండా జరుగుతాయని వారు చెప్తున్నారు.
 
లెట్రిల్‌లో దక్షిణాభిముఖంగా గానీ, ఉత్తరాభిముఖంగా గానీ కూర్చోవాలని, తూర్పు, పడమరలకు అభిముఖంగా కూర్చోకూడదని వాస్తు చెబుతోంది. గృహాన్ని చిమ్మేటప్పుడు ఈశాన్యంలో ప్రారంభించి నైరుతి వైపునకు చెత్తను పోగుచేయాలి. ఆగ్నేయమూల వంట చేయునప్పుడు.. తూర్పు అభిముఖంగా నిలిచి వంట చేయాలి.

ఇంటిని చిమ్మే చీపురు శని ఆయుధమని, అతని చేతిలో చీపురు ఎత్తిపట్టుకొనబడి ఉంటుందని.. అందువలన మనం చీపురును గోడకు ఆనించేటప్పుడు చీపురు పట్టుకునే భాగాన్ని పైకి మాత్రమే నిలబెట్టి ఉండడం శుభప్రదమని వాస్తు శాస్త్రం తెలుపుతోంది.
 
ఈశాన్యంలో దేవుని మందిరాలు నిర్మించి పూజ చేయరాదని.. ఇలా చేయడం వలన ఈశాన్యం మూతపడడం జరుగుతుందని వాస్తుశాస్త్రం చెబుతోంది. తూర్పు గోడలోనే దేవుని గూడును ఏర్పాటు చేసుకోవడం క్షేమదాయకమని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.  

అన్నీ చూడండి

అద్దెకు బాయ్‌ఫ్రెండ్ సేవలొద్దు.. అమ్మాయిలూ మోసపోతారు.. జర జాగ్రత్త : సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్

నిశ్చితార్థం రద్దు.. రూ.3 కోట్లు డిమాండ్ చేసిన మహిళ.. కేసు నమోదు

Rahul Gandhi, రాహుల్‌జీ మీ పెళ్లెప్పుడు?: GenZ నుంచి ప్రశ్న

మొబైల్ ఫోన్ టార్చ్ లైట్ల వెలుతురులో రోగికి చికిత్స.. ఎక్కడ?

నాన్న నాపై అత్యాచారం చేస్తున్నాడు: సనత్‌నగర్ పోలీసులకు బాలిక ఫిర్యాదు

అన్నీ చూడండి

08-08-2026 నాటి తెలుగు పంచాంగ వివరాలు ఎలా వున్నాయంటే?

08-08-2026 శనివారం ఫలితాలు - నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు...

విజయం ఆలస్యమైనదని బాధపడకు, ఎందుకంటే?

07-08-2026 నాటి రాశి ఫలితాలు.. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటారు

తుమ్ములు వచ్చేటప్పుడు కూడా భగవన్నామ స్మరణ ఎందుకు..? యముడు చెప్పిన కథేంటి?

తర్వాతి కథనం
Show comments