రాష్ట్రంలో ఆగిన అభివృద్ధి : చంద్రబాబు

Written By ఎం
Updated: గురువారం, 6 ఫిబ్రవరి 2020 (22:33 IST)
ప్రభుత్వ వైఖరితో రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయిందని తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు.

మంగళగిరి పార్టీ కార్యాలయంలో చంద్రబాబు మాట్లాడుతూ… కియా తమిళనాడుకు తరలిపోతోందన్నారు. కియాతో చర్చలు నిజమేనని తమిళనాడు అధికారులు స్పష్టం చేశారన్నారు.

తమ వాళ్లకే ఉద్యోగాలివ్వాలని వైసీపీ నేతలు బెదిరించారన్నారు. కియాను తరలించాలనుకోవడం దారుణమన్నారు. పిచ్చి తుగ్లక్ తో సమస్య తప్పదని కియా భయపడిందన్నారు. తప్పని పరిస్థితుల్లోనే కియా మార్చాల్సి వస్తోందంటున్నారు.

కియాను వీళ్లు ఎన్ని ఇబ్బందులు పెట్టారో తెలుస్తోందన్నారు. ప్రభుత్వ వైఖరితో రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయిందన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కియాకు సమస్యలు వచ్చాయని చంద్రబాబు నాయుడు అన్నారు.

కియాకు సహాయ నిరాకరణ చేయాలని అనంత రైతుల్ని జగన్ రెచ్చగొట్టారన్నారు. కియా సీఈవోను వైసీపీ ఎంపీ బెదిరించారన్నారు.

కియాతో రాష్ట్రానికి రూ.13,500 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. కియా కంపెనీతో 12వేల మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు.

అన్నీ చూడండి

Imtiaz Ali :: మెయిన్ వాపస్ ఆవుంగా తో 59 దేశాల్లో విజయం సాధించిన మ్తియాజ్ అలీ

Ajay Bhupathi : ఆ కథను నా డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఉంచుకోమని మహేష్ బాబు అన్నారు

Kajal Aggarwal: విడుదలకు ముందే చర్చకు తావిస్తున్న ది ఇండియా స్టోరీ

ఆ పోస్ట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారు.. ఆరోగ్యంగానే ఉన్నాను : అమితాబ్

జియోస్టార్, భారతదేశ వ్యాప్తంగా ఆరు బిగ్ బాస్ ఎడిషన్లు ఒకేచోట

తర్వాతి కథనం
Show comments