Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలో సర్వదర్శనం టోకెన్లకు ఎగబడిన భక్తులు...

Written By ఠాగూర్
Updated: మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (11:20 IST)
తిరుమలలో భక్తుల తోపులాట జరిగింది. సర్వదర్శన టిక్కెట్ల కోసం భక్తులు ఎగబడ్డారు. దీంతో ఈ తోపులాట సంభవించింది. గత రెండు రోజులుగా టోకెన్ల పంపిణీని నిలిపివేశారు. దీంతో ఈ టోకన్ల కోసం భక్తులు తమ చంటి బిడ్డలతో కలిసి క్యూలైన్లలో నిలబడ్డారు. అయితే, ఒక్కసారిగా భక్తులు టోకెన్లకు ఎగబడటంతో తోపులాట జరిగింది. 
 
రెండు రోజుల విరామం తర్వాత తిరుపతిలోని గోవిందరాజ స్వామి సత్రాలు, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద టోకెన్లను భక్తులు పంపిణీ చేశారు. అయితే గోవిందరాజస్వామి సత్రం వద్ద వేచివున్న భక్తులు ఒక్కసారిగా తరలిరావడంతో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ముగ్గురు భక్తులు గాయపడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. 
 
తితిదే విజిలెన్స్, పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా భక్తులను నిలువరించలేకపోయారు. మరోవైుపు తోపులాటలో గాయపడిన వారిని రుయా ఆస్పత్రికి తరిలంచారు. ఈ సర్వదర్శన టోకెన్లను అధిక ధరకు తితిదే అధికారులు, సిబ్బంది బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. 

అన్నీ చూడండి

Chiru 71st birthaday: చిరంజీవి బాస్ ఆఫ్ స్టైల్ అన్న మెహర్ రమేష్ - లివింగ్ లెజెండ్ అన్న థమన్

Suhas and Suri: మండాడి నుంచి సుహాస్ పోస్టర్, ఇంకోవైపు సూరి లవ్ ట్రాక్ విడుదల

Yash: ఓవర్ సీస్ లో భారీగా యశ్... టాక్సిక్ అమ్మకాలు - ఇంగ్లీష్ ట్రైలర్ విడుదల

షావుకారు జానకి తీవ్ర అస్వస్థత - వెంటిలేటర్‌పై చికిత్స!

Yami Gautam: చలాకి కోడలు గా యామీ గౌతమ్ చిత్రం నయ్యి నవెల్లి

తర్వాతి కథనం
Show comments