ఏపీ ఎంసెట్‌ పరీక్షలు.. జూలై 27నుంచి జరుగుతాయా?

Written By సెల్వి
Updated: శనివారం, 11 జులై 2020 (11:15 IST)
ఏపీ ఎంసెట్‌ జూలై 27నుంచి 31వరకు జరుగనున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించడంతో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు (సెట్స్‌) వాయిదా పడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్, ఈసెట్, ఐసెట్ పరీక్షల తేదీలను ఉన్నతవిద్యా మండలి ఖరారు చేసింది. జూలై 27 నుంచి 31 వరకు ఎంసెట్‌ పరీక్షలు నిర్వహిస్తారు. 
 
జూలై 24న ఈసెట్‌ పరీక్ష జరపనున్నారు. జూలై 25న ఐసెట్‌ ఎంట్రన్స్ నిర్వహించనున్నట్టు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. అయితే ప్రస్తుత పరీక్షల్లో ఎంసెట్ పరీక్షలు జరపడం అనుమానమేనని తెలుస్తోంది. 
 
ఇప్పటికే ఇంజనీరింగ్ విభాగంలో 1,79,774, అగ్రికల్చర్ మెడిసిన్ విభాగంలో 84,479 మంది, రెండు విభాగాలకు 604 మంది ఈ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ పరీక్షలు జరుగుతాయా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు.

అన్నీ చూడండి

అమీర్ లోగ్ చూస్తే హైదరాబాదీల మీద గౌరవం పెరుగుతుంది : దర్శకుడు రమణా రెడ్డి

స్క్రిప్ట్ విన్నప్పుడు సందేహం ఉండేది, ఇప్పటి ఆదరణకు ఆనందగా వుంది : కిరణ్ అబ్బవరం

Jai Krishna: కొన్ని చోట్ల అలా అనిపించొచ్చు, వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టాలి ఉంది : జై కృష్ణ ఘట్టమనేని

Rohit Nara : వినికిడి లోపం గల సౌండ్ ఇంజినీర్ గా రోహిత్ నారా టైటిల్ ప్రకటన

Surya and Mamitha Baiju : ది వెడ్డింగ్ సాంగ్ లో ఆడి పాడిన సూర్య, మమితా బైజు

తర్వాతి కథనం
Show comments