గురువారం, 20 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 19 నవంబరు 2025 (16:40 IST)

ఒరిగిపోయిన విద్యుత్ పోల్... టాటా నగర్ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం

loco engine
టాటా నగర్ ఎక్స్‌ప్రెస్ రైలుకు పెనుప్రమాదం తప్పింది. విద్యుత్ స్తంభం ఒకటి పక్కకు ఒరిగిపోయింది. దీన్ని గమనించిన లోకో పైలెట్ రైలును ఆపేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన విశాఖపట్టణం సమీపంలోని పెందుర్తి రైల్వే స్టేషన్‌కు సమీపంలో జరిగింది. 
 
ఈ రైల్వే స్టేషన్‌కు సమీపంలో విద్యుత్ లైన్ పనులు జరుగుతున్నాయి. అయితే, ఓ విద్యుత్ పోల్ పక్కను ఒరిగిపోయింది. అదేసమయంలో ఆ మార్గంలో టాటానగర్‌ ఎక్స్‌ప్రెస్‌ వస్తోంది. లోకో పైలట్‌ అప్రమత్తమై రైలును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. 
 
విద్యుత్‌ వైర్లపై స్తంభం పడటంతో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో దాదాపు గంట పాటు రైళ్ల రాకపోకలకు అంతరాయమేర్పడింది. రైల్వే సాంకేతిక నిపుణులు ఆ మార్గంలో పునరుద్ధరణ పనులు చేపట్టారు.