శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 30 సెప్టెంబరు 2019 (12:17 IST)

గ్రామ సచివాలయ ఉద్యోగులకు శుభవార్త .. సొంత మండలంలోనే...

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు సోమవారం ఏపీ ప్రభుత్వం నియామక పత్రాలను అందజేసింది. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ నియామకపత్రాలను అందజేశారు. గ్రామ సచివాలయ వ్యవస్థను అక్టోబరు 2వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారిని సొంత గ్రామంలో తప్ప వారు కోరుకున్న చోట ఎక్కడైనా పోస్టింగ్ ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో ఉద్యోగి సొంత మండలంలో మరే గ్రామమైనా.. జిల్లాలో మరెక్కడైనా కోరుకున్న ప్రాంతంలో పోస్టింగ్‌ ఇవ్వనున్నారు. 
 
పోస్టింగ్‌ కోసం సొంత జిల్లాలో మూడు ప్రాంతాలను ఎంపిక చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. జిల్లా సెలక్షన్‌ కమిటీల(డీఎస్సీ) ఆధ్వర్యంలో పోస్టింగ్‌ ఇస్తారు. ఈ మేరకు విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. దీనిపై పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజా శంకర్‌ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదివారం ఆదేశాలు జారీచేశారు. అయితే ఒకే గ్రామ సచివాలయంలో ఒకే పోస్టుకు ఇద్దరు ముగ్గురు పోటీపడినప్పుడు ఉద్యోగులు కోరుకున్న రెండు, మూడు స్థానాల్లో అవకాశం కల్పిస్తారు.