ఆదివారం, 29 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శనివారం, 29 మే 2021 (18:14 IST)

ఆనంద‌య్య మందుపై అప్పుడే నిర్ణ‌యం: మంత్రి గౌత‌మ్‌రెడ్డి వెల్ల‌డి

అమ‌రావ‌తి: నెల్లూరు జిల్లా కృష్ణ‌ప‌ట్నానికి చెందిన ఆనంద‌య్య త‌యారు చేసిన‌ ఔష‌ధంపై ఆయుష్ ఇంకా తుది నివేదిక ఇవ్వ‌లేద‌ని మంత్రి మేక‌పాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. ఆ నివేదిక వ‌చ్చే వ‌ర‌కూ ప్ర‌భుత్వం మందుపై తుది నిర్ణ‌యం తీసుకోద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

ఆయుష్ నుంచి నివేదిక వ‌చ్చిన త‌ర్వాత కొవిడ్ ప‌రిస్థితుల‌కు ఆధారంగా ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని మంత్రి వివ‌రించారు.

ఈ ఔష‌ధం విష‌యంలో ప్ర‌భుత్వం స్పందించి ఆయుష్ అనుమ‌తుల కోసం వేచి చూస్తున్న నేప‌థ్యంలో  నెల్లూరు జిల్లా కృష్ణ ప‌ట్నంలో మందు పంపిణీ చేసే ఏర్పాట్లు చేస్తామని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు.