వైకాపా రోజా చెంపలు పగులుతాయ్.. జాగ్రత్త: ఉష వార్నింగ్

గురువారం, 23 డిశెంబరు 2021 (12:49 IST)
వైకాపా ఎమ్మెల్యే, ఆర్కే రోజాపై తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు చక్రాల ఉష తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సినీ నటి, ఎమ్మెల్యే రోజా నోరు అదుపులో పెట్టుకోవాలనీ, లేదంటే చెంపలు పగులుతాయని హెచ్చరించారు. 
 
సీఎం జగన్‌ మెప్పు కోసం, మంత్రి పదవి దక్కించుకోవాలన్న ఆశతో ఇష్టారాజ్యంగా రోజా విమర్శలకు దిగితే తెలుగు మహిళలు ఊరుకోరన్నారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు వరద ధాటికి ఇబ్బందులు పడుతున్న సమయంలో ఆమె ఎక్కడున్నారని ప్రశ్నించారు.
 
రాజకీయాలకు అతీతంగా నారా భువనేశ్వరి వరద బాధితులకు సాయం అందించి ఆదుకున్నట్లు ఉష చెప్పారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో తనను అవమానించిన వారి గురించి ఆమె హుందాగా మీడియాకు సమాధానం చెప్పారన్నారు. ఎవరినీ నిందించలేదనీ, పేరు కూడా ప్రస్తావించలేదని గుర్తుచేశారు. 

అన్నీ చూడండి

New Delhi: 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతల ప్రకటన వెలువడింది

L.B. Sriram: ఆలస్యంగా గుర్తించినందుకు అవమానంగా ఉంది : ఎల్. బి. శ్రీరామ్

Ali: బద్రి లోని హే చికీతా పాట పెద్ద హిట్ అయిందో ఈ సినిమా హిట్ : అలీ

Soori: సుహాస్, సూరి నటించిన మండాడి చిత్రాన్ని విడుదలచేస్తున్న మైత్రి డిస్ట్రిబ్యూటర్స్

న్యూటన్స్ థర్డ్ లా' చాలా కొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే థ్రిల్లర్ : సుమంత్

తర్వాతి కథనం
Show comments