Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏటీఎం నుండి డబ్బులు డ్రా... రూ.2000 నోట్లు చూసి షాక్‌

Written By మోహన్
Updated: శనివారం, 16 మార్చి 2019 (19:35 IST)
ఈమధ్య కాలంలో ఏటీఎంల నుంచి డబ్బులు డ్రా చేసుకోవాలంటే యూజర్లు బెంబేలెత్తిపోతున్నారు. దీనికి కారణం... చిరిగిపోయిన కరెన్సీ నోట్లు వస్తుండటమే. ఇలాంటిదే జరిగింది. ఏటీఎం నుండి నగదు డ్రా చేసిన వ్యక్తి డబ్బులను చూసి ఒక్కసారిగా షాక్ తిన్నాడు. డ్రా చేసిన సొమ్ములో చిరిగిన నోట్లు రావడంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైయ్యాడు. ఈ ఘటన విజయవాడలోని మైలవరంలో వెలుగుచూసింది.
 
మద్దాలి గణేష్ అనే వ్యక్తి నారాయణ థియేటర్ కాంప్లెక్స్ వద్ద ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో రూ.30 వేలు డ్రా చేశాడు. అందులో 10 రెండు వేల రూపాయల నోట్లు చిరిగినవి వచ్చాయి. చిరిగిన నోట్ల విలువ రూ 20 వేలు ఉండడంతో అతను ఒక్కసారిగా విస్మయం చెందాడు.
 
దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులను మోసం చేయడం దారుణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా పలువురికి ఏటీఎంలో చిరిగిన నోట్లు దర్శనమిచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇది వరకు కూడా అనేక మార్లు చిరిగిన నోట్లను ఏటీఎంలో పెట్టారని ఆరోపించారు. ఈ విషయంపై అధికారులు వెంటనే స్పందించి, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని కోరారు.

అన్నీ చూడండి

Vikranth: హారర్ కామెడీ చిత్రంలో హీరో విక్రాంత్

Sam C.S : సామ్ సి. ఎస్. 39వ పుట్టినరోజు 100వ సినిమా మైలురాయి

NTR: ఐ యామ్ గేమ్ ట్రైలర్ గ్రిప్పింగ్‌గా, ఎంగేజింగ్‌గా సాగింది: ఎన్టీఆర్

Sumanth: న్యూటన్స్ థర్డ్ లా ప్రీమియర్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది: సుమంత్

MS Raju: అక్కడకు వెళితే దెయ్యాలున్నాయనే వైబ్రేషన్ కు గురయ్యా: ఎంఎస్ రాజు

తర్వాతి కథనం
Show comments