Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి అంతా గ్రాఫిక్స్... అదే చంద్రబాబు చేసిన అభివృద్ధి : విజయసాయి రెడ్డి

Written By ఠాగూర్
Updated: గురువారం, 2 జనవరి 2020 (21:20 IST)
అమరావతి అభివృద్ధిపై వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి మరోమారు తన ట్విట్టర్ ఖాతాలో కామెంట్స్ చేశారు. అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. ముఖ్యంగా, గ్రాఫిక్స్ పేరుతో ప్రజలను మోసం చేశారంటూ విజయసాయి రెడ్డి ఆరోపించారు. 
 
ఇదే అంశంపై ఆయన గురువారం ఓ ట్వీట్ చేశారు. 2014-19 మధ్య 1513 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. టీడీపీ నేతలు, రియల్టర్స్ అమరావతిలో ఎస్సీ, ఎస్టీలు, రైతుల నుంచి అక్రమంగా భూములు స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. 
 
రాజధాని అమరావతికి గత ప్రభుత్వం చేసింది ఏదైనా ఉందంటే.. అది భూసేకరణ కుంభకోణం, ఇన్‌సైడర్ ట్రేడింగ్, గ్రాఫిక్స్ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనిపై వ్యాఖ్యలు చేసే ధైర్యం చంద్రబాబుకు ఉందా? అంటూ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

అన్నీ చూడండి

Agadha Movie Review: ఎం.ఎస్.రాజు తీసిన అగథ మెప్పించిందా ? లేదా?

రజనీకాంత్, కమల్ హాసన్ ధర్మన్ రెండవ షెడ్యూల్ ప్రారంభం

హుషార్ పిట్టలు కంటెంట్ అందరికీ కనెక్ట్ అవుతుంది :వెంకట్‌ యాదవ్‌

Nag: కన్స్యూ మర్ యాప్ ను ప్రారంభించిన బ్రాండ్ అంబాసిడర్ అక్కి నేని నాగార్జున

Kamakshi Bhaskarla: వద్దు అని నా ముందే అన్నారు,అదే చేదు అనుభవం : కామాక్షి భాస్కర్ల

తర్వాతి కథనం
Show comments