1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 జులై 2022 (15:07 IST)

అమర్నాథ్ యాత్రలో విషాదం - ఏపీ భక్తురాలు మృతి

deadbody
పవిత్ర అమర్నాథ్ యాత్రలో విషాదం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళా భక్తురాలు ప్రాణాలు కోల్పోయింది. ఇటీవల ఆకస్మికంగా వర్షాలు కురవడంతో ఆ కారణంగా వరదలు వచ్చాయి. దీంతో అనేక మంది గల్లంతుకాగా, రాజమండ్రికి చెందిన ఇద్దరు మహిళలు కూడా ఉండగా, వీరిలో ఒకరైన గుణశెట్టి సుధ (48) చనిపోయినట్టు అధికారులు ధృవీకరించారు. 
 
గత రెండు రోజులుగా గాలింపు కొనసాగిస్తున్న నేపథ్యంలో సోమవారం శ్రీనగర్‌లోని ఆస్పత్రి మార్చురీలో సుధ మృతదేహాన్ని గుర్తించామని వారు వెల్లడించారు. మృతురాలు రాజమహేంద్రవరంలోని కుమారి టాకీస్‌ ప్రాంతానికి చెందినవారు. ఆమె మృతితో ఆ ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. మరో మహిళ పార్వతి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. 
 
ఇదిలావుంటే, నెల్లూరు జిల్లా నుంచి 82 మంది అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లారని కలెక్టర్‌ తెలిపారు. వీరిలో 57 మంది సురక్షితంగా ఉండగా.. మరో 25 మంది ఆచూకీ తెలియాల్సి వుందన్నారు. ఆచూకీ దొరకని వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నామన్నారు. నెల్లూరు జిల్లా యాత్రికుల కోసం 1902 టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.