1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Andhra Pradesh Assembly Sessions Ends Today

ఏపీ అసెంబ్లీ సమావేశాల కుదింపు.. నేటితో స్వస్తి..

Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మంగళవారంతో ముగించనున్నారు. ఈ నిర్ణయానికి కూడా మండలిలో ఆమోదముద్రపడిత నేటితో సమావేశాలు ఆఖరు కానున్నాయి. నిజానికి ఈ సమావేశాలను ఈ నెల 26వ తేదీ వరకు జరిపేలా ప్లాన్ చేశారు. కానీ, వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనాలన్న కుంటి సాకుతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 
 
ఇదిలావుంటే, ఈ సమావేశాల్లో 23 బిల్లులను ప్రవేశపెట్టాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం ఇప్పటికే 12 బిల్లులను ప్రవేశపెట్టింది. వీటిని మంగళవారం సభలో ఆమోదించుకోవడంతో పాటు.. కొత్తగా మరో 11 బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లుల ఆమోదంలో ఏదేని సాంకేతిక ఏర్పడిన పక్షంలో మరో రోజు అంటే బుధవారం వరకు పొడగించే అవకాశం ఉంది. అలాగే, వచ్చే నెలలో కూడా ఐదు రోజుల పాటు అసెంబ్లీని సమావేశపరచాలని ప్రభుత్వం భావిస్తోంది.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
మహిళలకు బంపర్ ఆఫర్.. ప్రతి నెలా రూ.1000.. ఎక్కడ?