1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Andhra Pradesh Cabinet Meeting

ఏపీ కేబినెట్ నిర్ణయాలు.. ఇవే..

Andhra Pradesh
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. డిసెంబర్ 27వ తేదీ శుక్రవారం సీఎం జగన్ అధ్యక్షతనలో మంత్రివర్గ సమావేశం జరిగింది. సుమారు రెండు గంటల పాటు ఈ భేటీ కొనసాగింది. అనంతరం కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను మంత్రి పేర్ని నాని వెల్లడించారు. 
 
* 2011 జనాభా లెక్కల ప్రకారం పంచాయతీ ఎన్నికలు.
* పంచాయతీ ఎన్నికల నిర్వాహణ కోసం రిజర్వేషన్ల ఖరారు. 
* కడప జిల్లా రాయచోటిలో వక్ఫ్ బోర్డుకు 4 ఎకరాలు కేటాయింపు. 
* మచిలీపట్నం పోర్టును రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తుంది. 
 
* 412 కొత్త 108 వాహనాలు కొనుగోలు. మార్చి 31లోపు కొనుగోలు చేసేందుకు రూ. 71 కోట్ల 48 లక్షలను నిధులు కేటాయింపు. 
 * 104 వాహనాలు (656) కొనుగోలు. ఇందుకు రూ. 60 కోట్ల 51 లక్షలతో నిధుల కేటాయింపు. 
* వ్యవసాయ ఉత్పత్తి కొనుగోలుకు కొత్త విధానం. 
* రాష్ట్రంలో 191 మార్కెట్ యార్డులను శాశ్వత కొనుగోలు కేంద్రాలుగాను, 150 ఉప మార్కెట్ యార్డులను శాశ్వత కొనుగోలు కేంద్రాలుగా మార్చాలని నిర్ణయం. 
* పసుపు, మిర్చీ, ఉల్లి, చిరుధాన్య పంటలకు ప్రతి సంవత్సరం మద్దతు ధర ముందే ప్రకటిస్తాం. ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.
About Writer
ఎం
తర్వాతి కథనం
తాత్కాలిక విరామం.. నారాయణ రిపోర్టు మేరకు అమరాతి ఎంపిక : పేర్ని నాని