1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (20:09 IST)

ఉన్నతాధికారులు కచ్చితంగా సచివాలయానికి రావాల్సిందే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయ ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. క‌రోనా కార‌ణంగా స‌చివాల‌యానికి రాని ఉన్నతాధికారులు అందరూ విధిగా కార్యాలయానికి రావాలని సూచించింది. అయితే కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించినా నేపథ్యంలో ప్రస్తుతం మళ్లీ ఏపీలో సాధారణ పరిస్థితులు వచ్చాయి. అతి తక్కువ కేసులు నమోదవుతున్నాయి. 
 
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయ ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. మొన్నటివరకు కరోనా వైరస్ కారణంగా సచివాలయానికి రాని ఉన్నతాధికారులు ఇప్పుడు ప్రతి రోజూ సచివాలయానికి తప్పనిసరిగా రావాలని సూచించింది.  
 
అంతేగాకుండా ఏపీ సచివాలయం పరిధిలో కరోనా వైరస్ పరిమితులను ఎత్తి వేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వివిధ శాఖల ప్రధాన కార్యదర్శులు ముఖ్య కార్య దర్శులు, కార్య దర్శులు అంతా కూడా ఇక నుంచి సచివాలయం నుంచి విధులు నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.
 
ఇక సచివాలయాలకు వస్తున్న ఉన్నతాధికారులు బయోమెట్రిక్ ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ ద్వారా హాజరు నమోదు చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు.