ఆదివారం, 8 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : శుక్రవారం, 8 మార్చి 2024 (16:57 IST)

కాపుల కోసం మరో రంగా వచ్చాడనుకున్నారు, ఆయనే పవన్ కల్యాణ్: పోసాని కృష్ణమురళి

posani krishnamurali
తెదేపా-జనసేన-భాజపా పొత్తు దాదాపు ఖరారవుతున్న సమయంలో వైసిపి నాయకులు తీవ్రస్థాయిలో ఈ మూడు పార్టీల నాయకులను విమర్శిస్తున్నారు. సినీ నటుడు, వైసిపి నాయకుడు పోసాని కృష్ణమురళి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఎన్టీఆర్ హయాంలో వంగవీటి మోహనరంగ హత్యకు గురయ్యారు. ఆయన సీఎం అవుతారని భావించి ఆయనను తెదేపా వారు హత్య చేసారంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.
 
అప్పట్లో ఎన్టీఆర్ కంటే రంగాకి పాపులారిటీ ఎక్కువగా వుండేదనీ, అందువల్ల సీఎం రంగా అవుతారనే భయంతో ఆయనను హత్య చేయించారని ఆరోపణలు చేసారు మురళి. ఆ రోజుల్లో రంగా కాపులకు న్యాయం చేస్తారని భావించారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చారన్నారు.
 
ఈయన కాపులకి వెన్నుదన్నుగా వుంటారని అనుకుంటుంటే పవన్ కల్యాణ్ నేరుగా చంద్రబాబును సమర్థిస్తున్నారని అన్నారు. కాపులకు సాయం చేయాల్సిన పవన్ చంద్రబాబుకి మద్దతు ఇస్తుంటే ఇక వారి కలలు నెరవేరేది ఎప్పుడు అంటూ ప్రశ్నిస్తున్నారు.