1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 29 నవంబరు 2021 (19:47 IST)

ఏపి బిజెపి రాష్ట్ర కోర్ కమిటీలో స‌భ్యులు వీరే!

ఏపీలో బీజేపీని బ‌లోపేతం చేయాల‌ని అధినాయ‌క‌త్వం సంక‌ల్పించింది. దీని  కోసం ఒక కోర్ క‌మిటీని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్ర‌క‌టించారు. కోర్ కమిటీలో 13 మంది సభ్యులు ముగ్గురు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు. ప్రకటించిన ఈ కోర్ కమిటీ సమావేశాన్ని తప్పనిసరిగా నెలకి ఒకసారైనా జరపాలని నిర్ణయించారు. 

 
పార్టీ ఏపీ అధ్యక్షులు సోము వీర్రాజు, జాతీయ ప్రధాన కార్యదర్శి పురందరేశ్వరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, ఎంపీలు జీవీఎల్, సిఎం రమేష్, టీజీ వెంకటేష్, సుజనా చౌదరి, కన్నా లక్ష్మీనారాయణ, మధుకర్ జి, మాధవ్, రేలంగి శ్రీదేవి, చంద్రమౌళి, నిమ్మక్క జయరాజు ఈ క‌మిటీలో ఉన్నారు.

 
ప్రత్యేక ఆహ్వానితులుగా నేషనల్ జాయింట్ సెక్రటరీ శివ ప్రకాష్ జి, ఏపీ ఇంచార్జ్ మురళీధరన్, సహ ఇంఛార్జ్ సునీల్ దేవధర్ ను నియ‌మిస్తూ, కేంద్ర బీజేపీ నాయ‌క‌త్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.