శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 7 ఆగస్టు 2019 (16:53 IST)

అందరికీ ఆరోగ్యం.. ఇదే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి వెల్లంపల్లి

ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఏపీ దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. 
 
పూర్ణానంద పేటలోని కౌతా వారి వీధిలో లాడ్జి బుర్రయోగ్స్ స్ట్రేంజ్, ఆంధ్ర హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని  మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. 
 
గత ప్రభుత్వం సేవా కార్యక్రమాలు కంటే స్వ ప్రయోజనాల కోసమే ఎక్కువ పాటు పడిందన్నారు. అందరికీ ఆరోగ్యం అందించాలనే ఉద్దేశంతో వైసార్ కాంగ్రెస్ పార్టీ సేవా కార్యక్రమాలు ప్రోత్సాహం అందించడంలో ముందుటుదనీ స్పష్టం చేశారు. 
ప్రజలకు సేవ చేసే స్వచ్ఛంద సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎటువంటి సహాయ అందించాలన్న తన వంతు ప్రయత్న అందిస్తాననీ తెలిపారు. వ్యాధులపై ప్రజలలో అవగాహన కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన సంస్థ నిర్వాహకులను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. 
 
అనంతరం కౌతు వెంకట సుబ్బారావు హై స్కూల్ విద్యార్థులకు ఉచిత పుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎం. వి. జగన్నాథం, బాయన అమరనాథ్, పిల్లా రవి, గుడివాడ కుమార్ తదితరులు పాల్గొన్నారు.