శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (09:37 IST)

ఏపీలో తొలిదశ పంచాయతీ ఎన్నికలు ప్రారంభం: 2,723 పంచాయతీల్లో పోలింగ్

ఏపీలో ఈ రోజు 2,723 పంచాయతీల్లో తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తెనాలి డివిజన్లో ఉద్రక్తతలు చోటుచేసుకున్నాయి. ఇక విజయవాడ విషయానికి వస్తే... ఇక్కడ 211 గ్రామ పంచాయతీలకు విజయవాడ రెవెన్యూ విభాగంలో మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి.
 
2447 పోలింగ్ కేంద్రాల్లో 7500 మందికి పైగా పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. ఉదయం 6.30 నుండి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరుగుతోంది. ఓట్ల లెక్కింపు సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది. ఫలితాలు తరువాత ప్రకటించబడతాయి.
 
సర్పంచ్ పోస్టుల కోసం మొత్తం 545 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. విజయవాడ రెవెన్యూ డివిజన్‌లోని 14 మండలాల్లో వార్డు సభ్యుల పోస్టులకు మొత్తం 4533 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 3100 మందికి పైగా పోలీసు సిబ్బంది, ఎన్‌సిసి క్యాడెట్లు, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు మరియు ఇతరులు ఎన్నికల విధిలో పాల్గొంటున్నందున ఎన్నికలకు గట్టి భద్రత ఉంది.