1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 29 నవంబరు 2023 (19:02 IST)

రూ.3.32 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిన ఏపీ?

andhra pradesh map
2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రూ.3.32 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. పెట్టుబడుల ఆకర్షణలో ఈ బలమైన పనితీరు 2019 నుండి రాష్ట్రాన్ని ఆర్థికాభివృద్ధిలో ఏపీ  ముందంజలో ఉంది. 2019 నుండి ప్రభుత్వ- ప్రైవేట్ రంగాల నుండి ప్రభుత్వం సేకరించిన సంచిత పెట్టుబడి 9,41,020 కోట్లకు చేరుకుంది. MSME ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ అండ్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆర్గానిక్ ఫుడ్ ప్రొడ్యూసర్స్ అండ్ మార్కెటింగ్ ఏజెన్సీల సంయుక్త సర్వేలో వెల్లడి అయ్యింది. 
 
సెంటర్ ఫర్ మానిటరింగ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ (CMIE) అందించిన డేటా ఈ కాలంలో, రాష్ట్రంలో 1,34,419 కోట్ల పెట్టుబడి ప్రాజెక్టులు పూర్తయ్యాయని, 27,110 కోట్ల విలువైన పెండింగ్ ప్రాజెక్టులు పునరుద్ధరించబడ్డాయి. 
 
 
2022-23 ఆర్థిక సంవత్సరంలో, బాకాయిలు ఉన్న పెట్టుబడి ప్రాజెక్టుల విలువ 17,90,533 కోట్లు కాగా, అమలులో ఉన్నవి 7,51,980 కోట్లు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు హై-పవర్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని కూడా అధ్యయనం సిఫార్సు చేసింది.
 
 
 
అదే ఆర్థిక సంవత్సరంలో, ప్రభుత్వం ప్రకటించిన కొత్త పెట్టుబడి ప్రాజెక్టులు మొత్తం 23,293 కోట్లు కాగా, ప్రైవేట్ రంగం గణనీయంగా 3,08,893 కోట్లు అందించింది. ఈ గణాంకాలు రాష్ట్ర ఆర్థిక వృద్ధి, అభివృద్ధిపై నిరంతర దృష్టిని హైలైట్ చేస్తాయి