1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , బుధవారం, 8 సెప్టెంబరు 2021 (12:43 IST)

అప‌వాదు తొల‌గేలా.... వెబ్ సైట్లో తీసి, ఈ గెజెట్ లో జీవోలు!

ఆంధ్ర‌ప్రదేశ్ లోని జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌భుత్వ జీవోల‌ను కూడా ర‌హ‌స్యంగా ఉంచుతోంద‌నే అప‌వాదు తొల‌గించుకునేందుకు ప్ర‌త్యామ్నాయం క‌నుగొన్నారు. ఆ అప‌వాదు తొల‌గేలా.... వెబ్ సైట్లో తీసి, ఈ గెజెట్ లో జీవోలు పెడుతున్నారు.
 
అధికారికంగా విడుదలయ్యే జీవోలు ప్రజాబాహుళ్యానికి అందుబాటులో లేకుండార‌, రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేస్తుందన్న విమర్శల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ఈ-గెజిట్ ద్వారా  ప్రభుత్వ ఉత్తర్వులను తిరిగి జారీ చేయాలని నిర్ణయించింది.

జీవో ఐఆర్ వెబ్‌సైట్‌ను నిలిపి వేసినందున సమాచార హక్కు చట్టం ప్రయోజనాలకు భంగం కలుగకుండా, ఏపీ ఈ-గెజిట్‌లో ఉత్తర్వులను ఉంచనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. అయితే, ఇక్క‌డో మెలిక కూడా పెట్టారు. ప్రజలకు అవసరం లేని సమాచారాన్ని ఏపీ ఈ-గెజిట్‌లో ఉంచబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది.