1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 20 అక్టోబరు 2021 (15:00 IST)

నాయ‌కులు, పార్టీల మ‌ధ్య ఇర‌కాటంలో జ‌ర్న‌లిస్టులు

రాష్ట్రంలో జర్నలిస్ట్‌ల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, యాజమాన్యాలు సరైన జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతుంటే మరోవైపు రాజకీయ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ (ఏపిబీజేఏ) రాష్ట్ర ఉపాధ్యక్షులు పఠాన్ మీరాహుస్సేన్‌ఖాన్ మండిపడ్డారు. టిడిపి కార్యాలయం వద్ద సాక్షి టివి విలేకరి అభిరామ్‌రెడ్డిపై కార్య‌క‌ర్త‌ల దాడి ప‌ద్ధ‌తి కాద‌ని, జ‌ర్న‌లిస్టులు ఎవ‌రైనా, త‌మ వృత్తి ధ‌ర్మాన్ని నెర‌వేరుస్తున్న‌పుడు వారిపై దాడి చేయ‌డం హేయ‌మ‌ని   మీరాహుస్సేన్‌ఖాన్ ఖండించారు. ముందు ముందు పార్టీ కార్యాల‌యాల వ‌ద్ద‌, నాయ‌కుల ఇళ్ల వ‌ద్ద రిపోర్టింగ్ చేసే జ‌ర్న‌లిస్టుల‌కు భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని పోలీసుల‌కు ఆయ‌న విజ్ణ్న‌ప్తి చేశారు. జ‌ర్న‌లిస్టులు కూడా క‌వ‌రేజి స‌మ‌యంలో జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని, విలేక‌రి లేనిదే వార్త లేద‌న్న ప్రాథ‌మిక సూత్రాన్ఇన అనుస‌రించి, ముందు త‌మ‌ని తాము కాపాడుకోవాల‌న్నారు. 
 
రాజకీయ నాయకులు మీడియా ప్రతినిధులపై దాడులు చేయడం పరిపాటిగా మారిందని, పార్టీ నాయకులకు అనుకూలంగా వార్తలు రాస్తే ఒక విధంగా, వారు చేసిన అక్రమాలు బయటపెడితే మరో విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. జర్నలిస్ట్‌లు ఉన్నది ఉన్నట్లు రాసే పరిస్థితులు లేకుండా పోయాయని, కవరేజ్‌కి వెళ్ళిన జర్నలిస్ట్‌లపై నాయకులు రాళ్ళు రువ్వడం సరైంది కాదని హిత‌వు చెప్పారు.  రాజకీయ పార్టీలు దాడులు, ఆలోచనలు మార్చుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని, అన్ని రాజకీయ పార్టీ నాయకులను మీరాహుస్సేన్ హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా నాయకులు ఆకుల వెంకటనారాయణ, శ్రీనివాసరావు, పఠాన్ సైదాఖాన్, పంగులూరి వెంకట్రావ్, తదితరులు అభిరామ్‌రెడ్డిపై, ఇత‌ర జ‌ర్న‌లిస్టుల‌పై దాడులను ఖండించారు.