బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 ఫిబ్రవరి 2022 (15:56 IST)

చందుపట్ల జంగారెడ్డి కన్నుమూత- పీవీ నర్సింహారావుపై గెలిచి...

chendupatla janga reddy
సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. మరణించేనాటికి ఆయన వయస్సు 87 ఏళ్లు. 1935 నవంబర్ 18న వరంగల్ జిల్లాలో జంగారెడ్డి జన్మించారు. ప్రస్తుతం ఆయన హన్మకొండలో నివాసం ఉంటున్నారు.
 
జంగారెడ్డి రాజకీయాల్లోకి రాకముందు కొద్ది రోజులు ప్రభుత్వ పాఠశాలలో హయ్యర్ సెకండరీ టీచర్‌గా పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీపీ నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహించిన ఆయన హన్మకొండ పార్లమెంట్ స్థానం నుంచి పీవీ నర్సింహారావుపై 54 వేల ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించారు.