సంబంధిత వార్తలు
- స్టీఫెన్ రవీంద్ర కోసం పట్టు... జగన్కు ఎందుకో అంత ఇష్టం!
- రాజ్యసభ సీట్లిస్తాం... కేసుల నుంచి వెసులుబాటు కల్పించండి.. జగన్ ఢిల్లీ టూర్ అంతర్యమిదేనా?
- సీఎం అయితే ఏంటి? 11 చార్జిషీట్లలో ప్రథమ నిందితుడు...
- అమిత్ షా దర్శనం కోసం ఢిల్లీకి జగన్... ఒక్క రోజు గ్యాప్లో రెండోసారి...
- దుష్ట చతుష్టయం రాష్ట్రాన్ని ధ్వంసం చేస్తున్నారు : దేవినేని ఉమ
జగన్ చేతకానితనం తెలిసిపోయింది : బోండా ఉమ
సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ ప్రజా చైతన్యయాత్ర నిర్వహించింది. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఒక అసమర్థుడు పాలన సాగిస్తున్నారన్నారు. ప్రజలు ఇబ్బంది పడుతున్నా ఏమీ పట్టనట్లు సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొమ్మిది నెలల కాలంలో జగన్ చేతకానితనం తెలిసిపోయిందన్నారు.
ప్రజావ్యతిరేక విధానాలను అమలుచేస్తూ, జగన్ నియంత పాలన సాగిస్తున్నారని బోండా ఉమ విమర్శించారు. పెన్షన్లను తొలగించి వృద్ధులు, వికలాంగులను రోడ్డున పడేశారన్నారు. నిరుద్యోగభృతి, కల్యాణ కానుక వంటి పథకాలను రద్దు చేశారని బోండా ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తర్వాతి కథనం
