గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 అక్టోబరు 2019 (14:48 IST)

విక్రమ్ ల్యాండర్ కూలిన ప్రాంతంలో చీకటి.. వెలుతురు వచ్చాక?

విక్రమ్ ల్యాండర్ కూలినట్లు భావిస్తున్న ప్రాంతం ప్రస్తుతం రాత్రి సమయం కావడంతో  తమ ప్రయత్నాలకు విరామం ఇచ్చినట్లు  ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. విక్రమ్ ల్యాండర్‌పై ఆశలు వదులుకోలేదని, సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నిస్తూనే ఉన్నామని ఇస్రో పేర్కొంది. అక్కడ రాత్రి సమయం 14 రోజులు ఉండడంతో విక్రమ్‌కు సౌరశక్తి లభించదని, మళ్లీ పగటి సమయం ఆరంభమయ్యాక విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాల పునరుద్ధరణకు తిరిగి ప్రయత్నాలు ప్రారంభిస్తామని తెలిపారు. 
 
సెప్టెంబర్ 7వ తేదీన ఇస్రో గ్రౌండ్ స్టేషన్‌కు విక్రమ్ ల్యాండర్‌కు మధ్య సమాచార సంబంధాలు కోల్పోయాయి. మరికొద్ది క్షణాల్లో ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ అవుతుంది అనగా గాడి తప్పింది. ప్రస్తుతం చంద్రుడిపై చీకటి అలుముకుంది. 10 రోజుల క్రితం అయితే చంద్రుడిపై సూర్యుడి కిరణాలు పడేవి. దీంతో ల్యాండర్‌తో సంబంధాల పునరుద్ధరణకై ప్రయత్నాలు జరిగాయి. ఇప్పుడు పూర్తిగా చీకటి నెలకొనడంతో ఆ ప్రయత్నాలకు కాస్త బ్రేక్ పడింది. అయితే మళ్లీ ల్యాండర్‌తో సంబంధాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నం చేస్తామని ఇస్రో ఛైర్మెన్ డాక్టర్ శివన్ చెప్పారు.
 
చంద్రమండలంపై వెలుతురు రాగానే తమ ప్రయత్నాలను ప్రారంభిస్తామని శివన్ చెప్పారు. ఇన్ని రోజుల తర్వాత ల్యాండర్, గ్రౌండ్ స్టేషన్‌ల మధ్య కమ్యూనికేషన్‌ను పునరుద్ధరించడం కష్టమే అయినప్పటికీ ప్రయత్నించడంలో తప్పులేదని డాక్టర్ శివన్ అన్నారు.