1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. cm ys jagan will launch one time settlement scheme on dec 21

పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్ పర్యటన

cm
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ఈ నెల 21 సీఎం జగన్‌ ప్రారంభించనున్నారు. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ప్రారంభించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్ పర్యటన మంగళవారం వుంటుంది. మంగళవారం ఉదయం 10:15 నిమిషాలకు ముఖ్యమంత్రి తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి 11 గంటలకు తణుకు చేరుకుంటారు. 
 
అక్కడ నుంచి రోడ్డు మార్గాన రాష్ట్రపతి రోడ్డులోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని.. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో మాట్లాటి.. మధ్యాహ్నం ఒంటి గంటకు తిరుగు ప్రయాణమై 1:50 గంటలకు తాడేపల్లి చేరుకుంటారని సీఎంఓ కార్యాలయ వర్గాలు పేర్కొన్నారు.
 
అయితే.. ఈ పథకంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధమే జరిగింది. పేదలు ఎవరూ ఓటీఎస్ కింద డబ్బులు చెల్లించొద్దని.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ ఉచితంగానే ఇంటి పట్టాలు అందజేస్తామంటూ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
ఎన్నిక‌లు ముందుకు... జ‌మిలి దిశగా కేంద్రం పావులు!