1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 4 మే 2021 (22:09 IST)

ఏపీలో సెకండ్ వేవ్.. 24 గంటల్లో 82 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ కోవిడ్ కేసులు భారీ స్థాయిలో పెరిగిపోతున్నాయి. కరోనా నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నా కేసుల ఉధృతి మాత్రం తగ్గట్లేదు. 
 
ప్రస్తుతం రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతిరోజూ ఏపీలో 15 వేలకు పైగానే కరోనా పాసిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. 
 
రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 20,034 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో 12,207 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించింది. కరోనా కారణంగా 82 మంది మృతిచెందారు.