1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: శనివారం, 7 ఆగస్టు 2021 (20:35 IST)

బ్ర‌హ్మంగారి మ‌ఠం స‌మీపంలో రోడ్డు ప్ర‌మాదం... న‌లుగురు మృతి!

కడప జిల్లా బద్వేలు, మైదుకూరు జాతీయ రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో కర్ణాటకకు చెందిన నలుగురు మృతి చెందారు.
 
బ్రహ్మంగారి మఠం డి.అగ్రహారం సమీపంలో టమోటా లోడు లారీ వేగంగా, మారుతి ఎర్టిగా కారును ఢీ కొనడంతో కారు నుజ్జునుజ్జు అయింది. కారులో ప్రయాణిస్తున్నఎనిమిది మందిలో నలుగురు మృతి చెందగా, ముగ్గరి పరిస్థితి విషమంగా ఉండటంతో కడప రిమ్స్కు తరలించారు. మృతులు కర్ణాటక రాష్ట్రం మొగల్కోట్‌కు చెందిన వారిగా గుర్తించారు.

ఈ ప్రమాదంలో సంవత్సరంలోపు చిన్నారి క్షేమంగా బయటపడ్డాడు. వీరంతా నెల్లూరు పట్టణంలో ఓ శుభకార్యానికి హాజరై తిరిగి వెళుతుండగా, ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నాలుగు మృత దేహాల్లో ఓ మహిళ ఇద్దరు పురుషులు కాగా ఓ చిన్నారి కూడా ఉన్నారు. అర్ధ రాత్రి సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ఆ శబ్దానికి గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గ్రామస్థుల సహాయంతో కారులో ఇరుక్కుపోయిన క్షతగాత్రులను బయటకు తీసి బద్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి 108 ద్వారా తరలించారు. నాలుగు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బద్వేల్ ఆస్పత్రిలో ఉంచారు.