శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (09:58 IST)

తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు వడగండ్ల వాన.. అలెర్ట్

Rains
నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండ ప్రభావం కారణంగా తెలంగాణలో నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో గాలివాన, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం వున్నట్లు హైదరాబాద్ ఐఎండీ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో వచ్చే ఐదు రోజుల్లో తమిళనాడులోని పుదుచ్చేరి, కర్ణాటక, తెలంగాణ, ఏపీలోనూ గాలివాన, ఈదురు గాలులతో వర్షం పడుతుందని పేర్కొంది. 
 
వచ్చే 5 రోజులలో కేరళ, తమిళనాడు-పుదుచ్చేరి-కరైకల్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 50-60 కిమీ ఉండొచ్చని, వడగళ్ల వాన కూడా చాలా ఎక్కువగా ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది.
 
దక్షిణాదితోపాటు దేశంలోని ఇతర ప్రాంతాలకూ వర్షం, వడగండ్ల వానల హెచ్చరికలు జారీ అయ్యాయి. అస్సాం, మేఘాలయ, మణిపూర్, మిజోరాం, పశ్చిమ బెంగాల్, సిక్కిం, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు, వడగళ్ల వానలు కురుస్తాయి ఏప్రిల్ 18 నుంచి 22 వరకు సర్వత్రా అప్రమత్తత అవసరమని, ఇళ్లు ధ్వంసం అయ్యేంత స్థాయిలో భారీ వడగండ్లు పడతాయని ఈ మేరకు ఐఎండీ అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది.