సంబంధిత వార్తలు
- టీడీపీ కార్యకర్తలపై మారణాయుధాలతో దాడి చేస్తారా?: బాబు
- వైకాపా నేతల చెప్పినవారినే వాలంటీర్లుగా నియమించాం.. : మంత్రి ధర్మాన ప్రసాద రావు
- జగన్కు ఓటేశాం... మా గ్రామానికేం చేశారు : తమ్మినేని సీతారాంకు ప్రశ్నల వర్షం
- పుట్టిన గడ్డకు అన్యాయం చేస్తుంటే చప్పట్లు కొట్టే కుక్కలు వైకాపా నేతలు : నారా లోకేశ్ ఫైర్
- సన్నబియ్యం సన్నాసీ.. డ్రాయర్పై నిలబెట్టి గుడివాడ వీధుల్లో తిపిస్తా : కొడాలి నానికి లోకేశ్ మాస్ వార్నింగ్
అమలాపురంలో హై టెన్షన్-200 మంది పోలీసులతో భారీ బందోబస్తు
అమలాపురంలో హై టెన్షన్ కొనసాగుతోంది. అమలాపురం మండలం ఈదరపల్లిలో వైసీపీకి చెందిన పోలిశెట్టి కిషోర్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. కొంతమంది గుర్తుతెలియని దుండగులు ఈ హత్య చేశారు. ఈ ఘటనపై అమలాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అయితే మాజీ హోం మంత్రి, టిడిపి నేత నిమ్మకాయల చిన రాజప్ప ప్రధాన అనుచరుడు గంధం పళ్ళంరాజుకు చెందిన అమలాపురంలోని రియల్ ఎస్టేట్ కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో భారీగా పోలీసులు మోహరించారు.
పలుచోట్ల పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. 200 మంది పోలీసులతో పట్టణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
