1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. High tension in Amalapuram

అమలాపురంలో హై టెన్షన్-200 మంది పోలీసులతో భారీ బందోబస్తు

police force
అమలాపురంలో హై టెన్షన్ కొనసాగుతోంది. అమలాపురం మండలం ఈదరపల్లిలో వైసీపీకి చెందిన పోలిశెట్టి కిషోర్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. కొంతమంది ‌గుర్తుతెలియని దుండగులు ఈ హత్య చేశారు. ఈ ఘటనపై అమలాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 
 
అయితే మాజీ హోం మంత్రి, టిడిపి నేత నిమ్మకాయల చిన రాజప్ప ప్రధాన అనుచరుడు గంధం పళ్ళంరాజుకు చెందిన అమలాపురంలోని రియల్ ఎస్టేట్ కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. 
 
పలుచోట్ల పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. 200 మంది పోలీసులతో పట్టణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
పసిడి ప్రియులకు ఇది గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం