1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 21 జులై 2022 (08:54 IST)

13 మంది అమ్మాయిలను మోసం చేసిన నిత్యపెళ్లికొడుకు

arrest
తెలుగు రాష్ట్రాల్లో మరో నిత్య పెళ్లి కుమారుడు వెలుగులోకి వచ్చాడు. ఈ రెండు రాష్ట్రాల్లో ఈయన ఏకంగా 13 మంది అమ్మాయిలను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. పైగా, ఒకే కాలనీలో ముగ్గురితో కాపురం చేశాడు కూడా. చివరకు అతని పంటపండి ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం బేతపూడికి శిశంకర్ బాబు అనే యువకుడు ఓ ఐటీ కంపెనీలో 2 లక్షల జీతానికి పని చేస్తున్నట్టు నమ్మించడమే పనిగా పెట్టుకున్నాడు. ఏదో విధంగా అమ్మాయిలకు మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకుని అందినకాడికి దండుకోవడం, గట్టిగా నిలదీస్తే పరారవడం అతడి నైజంగా మారింది. ఆ విధంగా ఇప్పటివరకు దాదాపు 13 మంది అమ్మాయిలను మోసం చేశాడు. 
 
దీంతో అతని చేతిలో మోసపోయిన యువతులు హైదరాబాద్, సంగారెడ్డి, గుంటూరు జిల్లాల్లో పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదు చేశారు. చివరకు అమెరికాలోని ఓ యువతిని కూడా మోసం చేశాడు. బాగా డబ్బున్నవారికి గాలం వేసి తన పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నించాడు. ఇక్కడ విచిత్రమేమిటంటే.. ఒకే కాలనీలో ముగ్గురితో కాపురం చేశాడంటే అతని ఎంత ఘరానా మోసగాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.