శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (10:35 IST)

ప్రియుడితో వీడియో కాల్ మాట్లాడుతూ.... ఉరేసుకుంది..

కృష్ణా జిల్లా నూజివీడులోని ట్రిపుల్ ఐటీలో ఓ విషాదం జరిగింది. ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తన ప్రియుడితో వీడియో కాల్ మాట్లాడుతూనే ఫ్యానుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తూర్పు గోదావరి జిల్లా గోకవరానికి చెందిన ఆర్‌.భాగ్యలక్ష్మి అనే విద్యార్థిని నూజివీడులోని ట్రిపుల్‌ ఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌ తృతీయ సంవత్సరం చదువుతోంది. తన ప్రియుడుతో వీడియో కాలింగ్‌ చేస్తూ హాస్టల్‌ రూములో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 
 
ఈ విషయాన్ని సహచర విద్యార్థినులు హాస్టల్ వార్డెన్‌కు చెప్పారు. ఆ తర్వాత పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు.. సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రేమ వ్యవహారమే విద్యార్ధిని ఆత్మహత్యకు కారణమని కాలేజీ సిబ్బంది చెబుతున్నారు. అయితే ఆత్మహత్యకు గల సరైన కారణాలు తెలియాల్సి ఉంది.