గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 3 సెప్టెంబరు 2024 (12:18 IST)

వరద బాధితులకు అండగా నిలిచిన జూనియర్ ఎన్టీఆర్, విశ్వక్సేన్.. ఎంతిచ్చారంటే?

junior NTR
అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ వరద బాధితులకు అండగా నిలిచారు. అలాగే మరో టాలీవుడ్ హీరో విశ్వక్సేన్ కూడా వరద బాధితులకు ఆదుకున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదల వల్ల నష్టపోయిన వారిని ఆదుకోవడానికి ఎన్టీఆర్ కోటి రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఏపీ, తెలంగాణలకు చెరో రూ.50 లక్షల మేర ఆదుకున్నారు. అలాగే విశ్వక్సేన్ పది లక్షల రూపాయలను వరద బాధితుల కోసం అందజేశారు. 
 
భారీ వర్షాల కారణంగా సంభవించిన వినాశకరమైన వరద బాధితుల కోసం ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా తన హృదయపూర్వక ఆందోళనను వ్యక్తం చేశారు. "రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నేను చాలా చలించిపోయాను. ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలందరూ త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను" అని ఎన్టీఆర్ అన్నారు.