ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాడు. అయితే కేఏ పాల్ చేసే ప్రచారాలు ప్రజల వద్ద కంటే పాస్టర్ల సంఘాల్లో ఎక్కువగా ఉంటున్నాయి. ఈ ఎన్నికల్లో తాను గెలుస్తానని ధీమా కూడా వ్యక్తం చేస్తున్నాడు. ఏపీలో ఉన్న మూడు ప్రధాన పార్టీలను చిత్తు చిత్తుగా ఓడిస్తానని చెబుతున్నాడు. తాను కూడా నర్సాపురం నుంచే పోటీ చేస్తానని పేర్కొంటూ పవన్, నాగబాబు కాస్కోవాలని...